హైదరాబాద్: రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. ఖనిజ, గనులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ తదితర శాఖల డైరెక్టర్లు ఈ ప్రత్యేక విభాగంలో సభ్యులుగా ఉంటారని, ఎగుమతిదారులు ఎలాంటి సమస్య అయినా వారి దృష్టికి తీసుకు వెళ్లవచ్చునని చెప్పారు. భారతీయ ఎగుమతుల సంఘాల సమాఖ్య (FIEO) నిర్వహించిన తెలంగాణలో ఎగుమతులు - సమస్యలు అంశంపై ఆయన మాట్లాడారు.

పది రాష్ట్రాల జాబితాలో నిలిచింది
ఎగుమతుల రంగంలో తెలంగాణ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందని జయేష్ రంజన్ అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1.56 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల జాబితాలో నిలిచిందని చెప్పారు. మరింత వృద్ధి సాధించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కేంద్రం రాయితీలన్ని సద్వినియోగం చేసుకునే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు.

వీటికి మంచి డిమాండ్
పారిశ్రామిక పురోగమనానికి ఎగుమతులు కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఎగుమతుల వృద్ధిలో ఐటీ రంగం అగ్రస్థానంలో ఉందని, గత ఏడాది రూ.1.05లక్షల కోట్ల మేర ఎగుమతులు ఉన్నాయన్నారు. ఇతర ఉత్పత్తుల సేల్స్ రూ.51వేల కోట్ల మేర ఉన్నాయన్నారు. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలకు ఎగుమతులు లాభదాయకంగా ఉన్నాయని, ఐటీ, ఔషధ, వైమానిక, ఇంజినీరింగ్, గ్రానైట్, చేనేత, జౌళి, హస్తకళలు వంటి వాటికి మంచి డిమాండ్ ఉందన్నారు.

7.38 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతి
దేశంలో ఎగుమతులు చేస్తున్న రాష్ట్రాల్లో టాప్ 5 స్థానానికి చేరాలన్నది తెలంగాణ లక్ష్యమన్నారు. తెలంగాణలో మరో అయిదేళ్లలో ఎగుమతులు రెట్టింపు అవుతాయన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 7.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి నమోదు అయిందన్నారు.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications