బెంగళూరుకు చెందిన మోస్ట్ వ్యాల్యూడ్ ఎడ్-టెక్ స్టార్టప్ బైజూస్ వ్యాల్యుయేషన్ ఇప్పుడు ఏకంగా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సిరీస్ ఎఫ్ ఫండింగ్ రౌండ్లో ఇది చరిత్ర సృష్టించింది. సీరీస్ F ఫండింగ్ రౌండ్లో బైజూస్ వ్యాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు పెరిగి, 5.52 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం సింగిల్ రౌండ్లోనే అనూహ్యంగా పెరగడం అరుదైన విషయం.

బైజూస్ F సిరీస్ ఫండింగ్
బైజూస్ F సిరీస్ ఫండింగ్ రౌండ్లో రూ.3,159.4 కోట్ల (460.8 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. సౌతాఫ్రికాకు చెందిన నాస్పర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ జనరల్ అట్లాంటిక్, కెనెడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వంటి ఇన్వెస్టర్ల ఆధ్వర్యంలో దీనిని సమీకరించింది. ఈ నిధుల సేకరణలో ఈ కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. ఒక్క సింగిల్ రౌండ్లోనే బైజూస్ వ్యాల్యూ 53 శాతం పెరగడం గమనార్హం. ఇది గత డిసెంబర్ నుంచి నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించింది.

ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్ల సేకరణ
సిరీస్ F ఫండింగ్ను డిసెంబర్ నుంచి ప్రారంభించింది. అంతకుముందు ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. జూలై మొదటి వారం, నాలుగో రౌండ్లో 86 మిలియన్లు (రూ.589 కోట్లు) సేకరించింది. ఆరు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లు సేకరించింది. సింగిల్ రౌండ్లో ఇంతటి ఇన్వెస్ట్మెంట్స్ అసాధారణమని, బైజూస్ వేగవంతమైన వృద్ధి కారణంగా ఫండ్స్ వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే బైజూస్ వ్యాల్యూయేషన్ పెరుగుతోంది
2019 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బైజూస్ రెవెన్యూ మూడు రెట్లు పెరిగి, రూ.1,430 కోట్లకు చేరుకుంది. ఏడాది మొత్తం లాభదాయకంగా ఉంది. ఇతర స్టార్టప్స్ వలే ఏడాదికి ఏడాది ప్రాతిపదికన కాకుండా నెలకు నెలకు వ్యాల్యుయేషన్ పెరుగుతోందని బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫాం పేపర్.వీసీ ఫౌండర్ వివేక్ దురై అన్నారు. ఇండియాలోని యూనికార్న్స్లలో బైజూస్కు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. గ్రేడ్స్ I-IIIతో పాటు యూఎస్ మార్కెట్లోకి విస్తరించిన నేపథ్యంలో వ్యాల్యుయేషన్ భారీగా పెరిగిందని చెబుతున్నారు.

అమెరికాలో కొనుగోలు
ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఖతార్ సావరీన్ వెల్త్ ఫండ్ వంటి కొత్త ఇన్వెస్టర్లు 150 మిలియన్ డాలర్లు (రూ.1,028.61 కోట్లు) సమీకరించినట్లు గత వారం బైజూస్ వెల్లడించింది. ఎడ్-టెక్ ఇన్వెస్టర్ వోల్ వెంచర్స్ కూడా ఈ ఇండియన్ స్టార్టప్ (బైజూస్)లో ఇన్వెస్ట్ చేసింది. గత డిసెంబర్లో బైజూస్ 540 మిలియన్ డాలర్లు (రూ.3,865 కోట్లు) సమకూర్చినట్లు ప్రకటించింది. మార్చి 2019 ఎండ్ నాటికి రూ.1,430 కోట్ల రెవెన్యూను ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో బైజూస్ యూఎస్కు చెందిన ఓస్మో ( Osmo)ను 120 మిలియన్ల డాలర్లకు (రూ.850 కోట్లు) కొనుగోలు చేసింది.

పిల్లల చదువుకు ఇండియన్ పేరెంట్స్ రెడీ
తమ పిల్లల విద్యపై ఖర్చు చేసేందుకు ఇండియన్ పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారని, ఇది కూడా బైజూస్ ఆదరణకు ముఖ్య కారణమని చెబుతున్నారు. ఇప్పటికే ఇది 35 మిలియన్ల మంది విద్యార్థులకు చేరువైందని, మేథమేటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతోందన్నారు. K-12 విద్యార్థులు, కొత్త మార్కెట్లోకి విస్తరించడం వల్ల బైజూస్ మార్కెట్ వ్యాల్యూయేషన్ పెరుగుతుందన్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications