ఆదాయపు పన్ను శాఖ ఇక మరింతగా తన పరిధిని పెంచబోతోంది. లావాదేవీల విషయంలోనూ ఉక్కుపాదం మోపబోతోంది. నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు మరో వినూత్న మార్గాన్ని అన్వేషించబోతోంది. ఇకపై భూములు, బంగారం, గోల్డ్, బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసిన వెంటనే ఐటీ శాఖ నుంచి మీ మొబైల్కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అవాక్కయ్యేలా ఉన్నా ఇది త్వరలో నిజం కాబోతోంది !

ఐటీ ఫోకస్లో 18 లావాదేవీలు !
ప్రధానంగా పద్దెనిమిది అధిక విలువ కలిగిన లావాదేవీలను టార్గెట్ చేసింది ఐటీ శాఖ. ముఖ్యంగా ప్యాన్ నెంబర్ను వెల్లడించాల్సిన ట్రాన్సాక్షన్స్కు ఎస్ఎంఎస్ను లింక్ చేయబోతోంది. సదరు లావాదేవీ జరిగిన వెంటనే ప్యాన్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయగానే ఐటీ శాఖకు సదరు వివరాలు వెళ్తాయి. ఈ ట్రాన్సాక్షన్ తమ దృష్టికి వచ్చింది అని తెలిపేలా ఐటీ శాఖ నుంచి కూడా మనకు మెసేజ్ అందుతుంది.
''ఇక నుంచి ఆదాయపు పన్ను శాఖ... అసెసీలు (ట్యాక్స్ పేయర్స్) అందరికీ అకౌంటెంట్ మాదిరి వ్యవహరించనుంది. లావాదేవీ పూర్తైన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్కు మెసేజ్ వచ్చేలా టెక్నాలజీ వేదికను రూపొందిస్తున్నాం. ఎక్కువ విలువ ఉన్న లావాదేవీల వివరాలను ఐటీ రిటర్న్స్లో కూడా విధిగా తెలియజేయాలని మేం కోరుతున్నాం ''- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ పి.సి. మోడీ

క్రాస్ చెక్ చేస్తారు
మీరు చేసే హై వేల్యూ ట్రాన్సాక్షన్ సమాచారం ఐటీ శాఖ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్లు కూడా మీరు దాఖలు చేసే రిటర్న్స్తో క్రాస్ చెక్ చేసుకునే వీలుంటుంది. అందుకని తప్పించుకునే అవకాశాలు ఉండవు అనేది ఐటీ శాఖ ఆలోచన. ఫైనాన్స్ బిల్ 2019 పాస్ అయిన తర్వాత ప్యాన్ స్థానంలో ఆధార్ను కూడా వాడే అవకాశం ఉంటుంది. అందుకే గరిష్టంగా చేసే లావాదేవీలపై ఇక నుంచి ఐటీ శాఖ దృష్టి ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ నెంబర్ ఉంది. అదే సమయంలో మార్చి నాటికి మన దేశంలో ప్యాన్ ఉన్న వాళ్ల సంఖ్య కూడా 44.57 కోట్లుగా ఉంది. వీటిల్లో సుమారు 25 కోట్ల ప్యాన్లు ఆధార్తో అనుసంధానమై ఉన్నాయి. ఇక మిగిలినవి కూడా ఆ సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లేకపోతే ఆ ప్యాన్ నెంబర్స్ పనిచేయవు అని ఐటీ శాఖ స్పష్టంగా హెచ్చరించింది.

ఏ ట్రాన్సాక్షన్స్ పరిధిలోకి వస్తాయ్
ఐటీ శాఖ 114బి ప్రకారం సుమారు 18 లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయి. వాటిల్లో టూ, ఫోర్ వీలర్ వాహనాల కొనుగోలు, బ్యాంక్ ఖాతా తెరవడం, నూతన క్రెడిట్ కార్డ్ వంటివి జాబితాలో వస్తాయి. వీటికి తోడు రూ.50 వేలకు మించి హోటళ్లు, రెస్టారెంట్లలో చేసే నగదు లావాదేవీలు, విదేశీ పర్యటనలకు టికెట్లు, విదేశీ కరెన్సీ కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు వంటివి ఉన్నాయి.
ఇవే కాకుండా ఒక రోజులో ఏదైనా బ్యాంక్ (కో ఆపరేటివ్, పోస్టాఫీస్ కూడా) ఖాతాలో రూ.50 వేలకుపైగా చేసే చేసే నగదు డిపాజిట్లు ఉన్నాయి. రూ. 1 లక్షకు విలువ ఉన్న సెక్యూరిటీలు (షేర్లు కాకుండా), రూ.10 లక్షలకు అంతకు పైగా విలువ ఉన్న స్థిరాస్థి కొనుగోలు - అమ్మకం కూడా హై వేల్యూ పరిధిలోకి వస్తాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications