న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన ఆయా రంగాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను అంశంలోను ముఖ్యంగా ఐదు మార్పులు ఉంటాయని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు ఈ బడ్జెట్లో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం సెక్షన్ 80సీ, సెక్షన్ 80 డి వంటి రాయితీలను ప్రకటించినా ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ఇన్కం ట్యాక్స్ మినహాయింపులు ఏం కోరుకుంటున్నారు?
సెక్షన్ 80 డీ కింద వచ్చే ప్రయోజనాలను పెంచాలని కోరుకుంటున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు పెరిగే అవకాశముందంటున్నారు. జాతీయ పింఛన్ పథకంలో వీలైనంతమంది చేరేలా కృషి చేస్తే, ఇది లబ్ధిదారులకు ప్రయోజనకరమని అంటున్నారు. అలాగే, పెట్టుబడుల అలవాట్లు పెంచేలా ట్యాక్స్ విధానం ఉండాలని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు పలు దేశాల్లో వివిధ మార్గాలు ఉన్నాయి. ట్యాక్స్ ఎక్సెంప్షన్ పరిధిని రూ.3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. ఇలా చేస్తే ట్యాక్స్ పేయర్స్కు రూ.2,500 ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, NPS స్కీంలో రిలీఫ్ కోరుకుంటున్నారు. సెక్షన్ డీ డిడక్షన్ పరిధిని పెంచుతారని భావిస్తున్నారు.

ట్యాక్స్ ఫ్రీ బాండ్స్తో అందరికీ ప్రయోజనం
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ట్యాక్స్-ప్రీ బ్రాండ్స్ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. ఇది ట్యాక్స్ పేయర్స్తో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కల్పన కోసం ప్రభుత్వ సంస్థలకు మూలధన సమీకరణకు కూడా ఉపయోగపడుతుంది. వీటిని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్గా పిలుస్తారు. ఎందుకంటే వీటిపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉండదు. సాధారణంగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. పదేళ్లు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బాండ్స్ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎక్కువగా లబ్ధి పొందుతుందని చెబుతున్నారు.

ఈక్విటీ షేర్లు
లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ యూనిట్ల అమ్మకాలపై లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (LTCG) పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది ఏడాదికి రూ.1 లక్షగా ఉంది. దీనిని పెంచితే మరింత పెట్టుబడులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెబుతున్నారు. అయిదేళ్లు దాటి షేర్లు లేదా మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వారికి పన్ను రాయితీలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా ఉంది. వైద్యం ఖరీదుగా మారిందని, కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులు ఎక్కువగా పెంచాలని కోరుతున్నారు.

అలా ఆదాయం పెరగవచ్చు
నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ రంగంలో దూకుడు రావాలంటే గృహ నిర్మాణాలపై పన్ను రాయితీలు కోరుతున్నారు. ఇప్పటికే జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతం చేయడంతో రియల్ బూమ్ భారీగా పెరిగింది. పన్ను రాయితీలు ఇస్తే.. నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు జోరందుకుంటాయని, అప్పుడు జీఎస్టీ ద్వారా పన్ను రూపంలో ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications