టెక్ దిగ్గజాలను నియంత్రించాలనుకుంటే: సుందర్ పిచాయ్ హెచ్చరిక
వాషింగ్టన్: పెద్ద పెద్ద కంపెనీలపై స్క్రూటిని సమంజసమేనని, కానీ నియంత్రించాలి కాబట్టి నియంత్రణలు విధించాలనుకుంటే మాత్రం ఆమోదయోగ్యం కాదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఆయన సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెద్ద కంపెనీలను నియంత్రించాలనే ఉద్దేశ్యంతోనే నియంత్రణలు విధిస్తే అందుకు సంబంధించిన పరిణామాలు ఊహకు కూడా అందవన్నారు.
తెలంగాణకు మిగులు ఎంత అంటే, ఏపీపై ఏడాదికి 40 వేలకోట్ల అప్పు
యాంటీ ట్రస్ట్ వయోలేషన్ దర్యాఫ్తు నేపథ్యంలో గూగుల్ సెర్చ్ బిజినెస్, అడ్వర్టయిజ్మెంట్ ప్రాక్టీసెస్ స్క్రూటినిని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ల పర్యవేక్షణ కోసం యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఫెడరల్ ట్రేడ్ కమిషన్ బాధ్యతలను పంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
స్క్రూటినీ నిర్ణయం సరైనదేనని, కానీ నిర్మాణాత్మక చర్చల్లోను తాము పాల్గొంటామని చెప్పారు. కేవలం నియంత్రించాలని నియంత్రించాలని చూస్తే మాత్రం అది అనాలోచిత నిర్ణయమని, దీని పట్ల తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. తాము స్క్రూటినీని యూరోప్లోను ఎదుర్కొన్నామని, తమకు ఇది కొత్త కాదని, కొన్ని ఇతర కంపెనీలకు కొత్త కావొచ్చునని చెప్పారు.
యాంటీ ట్రస్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్పై కేసులు పెట్టేందుకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) సిద్ధమవుతోంది. 2010లో షాపింగ్ సెర్చ్ రిజల్ట్స్కు గూగుల్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని 2010లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో 2017లో గూగుల్ పైన 2.7 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు.