బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురాం రాజన్

లండన్: ప్రముఖ ఆర్థిక నిపుణులు రఘురాం రాజన్‌కు అరుదైన అవకాశం రాబోతుందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో ఈయన కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్‌గా మార్క్ కార్నే ఉన్నారు. పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ రేసులో అందరికంటే ముందు రఘురాం రాజన్ ఉన్నారని తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విదేశీయులకు అవకాశమిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవికి పోటీ పడుతున్న యునైటెడ్ కింగ్‌డమ్‌యేతర ఆర్థికవేత్తల్లో రఘురాం రాజన్ ఒక్కరే కావడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో థెరిసా మే రాజీనామా కూడా చేశారు. అనిశ్చిత పరిస్థితుల్లో రఘురాం రాజన్ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 325 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. అయితే దీనిపై ఇటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లేదా రఘురాం రాజన్ కానీ స్పందించలేదు.

Raghuram Rajan in race to become next Bank of England Governor

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవికి దరఖాస్తులు గత వారం ముగిశాయి. రఘురాం రాజన్ రేసులో ఉన్నారని బ్లూమ్‌బర్గ్ వార్త ఇచ్చింది. ఈ విషయమై ఆయనను అదే మీడియా సంస్థ కాంటాక్ట్ చేయగా అతను మాట్లాడేందుకు నిరాకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్‌తో పాటు ముగ్గురు ఉన్నారు. డార్ట్‌మౌత్ కాలేజ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ బ్లాంచ్‌ప్లవర్, బీఓఐ ఫైనాన్షియల్ రెగ్యులేటర్‌గా పనిచేసిన అనుభవమున్న ఆండ్రూ బైలీ గవర్నర్ పోస్టుకు పోటీ పడుతున్నారు. వీరిద్దరి కంటే రాజన్ ముందున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రయ పూర్తయ్యాక స్పష్టత రానుంది.

రఘురాం రాజన్ ఇండియన్ ఎకనమిస్ట్. ఇంటర్నేషనల్ అకడమిషియన్. ఈయన 23వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్. సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2016 వరకు పని చేశారు. 3 ఫిబ్రవరి 1963లో జన్మించారు. ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్‌గా ఉన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేశారు. రఘురాం రాజన్ వయస్సు 56 ఏళ్లు.

భారత్‌లో గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన న్యాయ్ స్కీం సూచన చేశారు. ప్రతి పేద కుటుంబానికి కనీస ఆదాయం రూ.12వేలుగా ఉండేలా చూసేదే న్యాయ్ స్కీం. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం రూ.12 వేలు ఉండేలా చూస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+