విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్, వేతనాల పెంపు
సాఫ్టువేర్ సర్వీసెస్ ఎక్స్పోర్టర్ విప్రో తమ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇండియాలోని ఆఫ్షోర్ ఉద్యోగులు, ఆన్లైట్ ఉద్యోగులు, అమెరికా, యూరోప్లలోని ఉద్యోగులకు వేతనాలు పెంచింది. బెంగళూరు హెడ్ క్వార్టర్ కలిగిన విప్రో 6 శాతం -8 శాతం మధ్య వేతనాలు పెంచింది.
జూనియర్ లెవల్ ఉద్యోగుల నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులకు 6-8 శాతం వేతనం పెంచింది. అదే సమయంలో మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి డిజిటల్ టెక్నాలజీలో పని చేస్తోన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ప్రకటించింది.
వంటనూనె కంపెనీ నుంచి గ్లోబల్ ఐటీ దాకా.. ప్రేమ్జీ ప్రస్థానం! సేవా కార్యక్రమాల కోసం రూ.వేలకోట్లు
సగటున ఆఫ్షోర్ ఉద్యోగులకు హైసింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్, ఆన్సైట్ ఉద్యోగులకు లో నుంచి మిడిల్ సింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేటివ్ మరియు ఫ్యూచర్ ఓరియెంటెడ్ టెక్నాలజీపై పని చేస్తున్న ప్రారంభ ఉద్యోగులకు ప్రత్యేకమైన ఇన్సెంటివ్లు, రివార్డులు ఇస్తారు. తద్వారా వారిని ప్రోత్సహిస్తారు.
విప్రోలో మార్చి 31, 2019 నాటికి 1.7 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 1 నుండి 5 ఏళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. డేటా సైన్స్ వంటి స్కిల్స్ కలిగిన ఉద్యోగులకు కంపెనీ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో విప్రో క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటించింది.