బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్జీ త్వరలోనే రిటైర్ కానున్నారా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. జూలై 30వ తేదీన అజీజ్ ప్రేమ్జీ పదవీవిరమణ చేయనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విప్రో ఐటీ కంపెనీకి అజీమ్ ప్రేమ్జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే జూలై 31 నుంచి ఐదేళ్ల పాటు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారని విప్రో సంస్థ తెలిపింది. అంతేకాదు అజీమ్ ప్రేమ్జీ విప్రో సంస్థ వ్యవస్థాపకులు అని ఆ కంపెనీ బీఎస్ఈలో చేసిన ఫైలింగ్లో తెలిపింది.
ఇక అజీమ్ ప్రేమ్జీ తర్వాత వారసత్వాన్ని తన కుమారుడు రిషద్ ఏ ప్రేమ్జీ కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. జూలై 31 నుంచి రిషద్ ప్రేమ్జీ పూర్తి స్థాయి డైరెక్టరుగా బాధ్యతలు చేపడుతారని కంపెనీ వెల్లడించింది.2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇక కంపెనీ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అబీద్అలీ నీముచావ్లా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడం జరుగుతుందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయించారు. ఈ మార్పులన్నీ జూలై 31, 2019 నుంచి అమల్లోకి వస్తాయని బోర్డు స్పష్టం చేసింది.

తన సుదీర్ఘ ప్రయాణంలో తన పదవి తనకు ఎంతగానో తృప్తి కలిగించిందని అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. భవిష్యత్తులో దాతృత్వ జీవితం గడపాలని తాను భావిస్తున్నట్లు అజీమ్ తెలిపారు. అంతేకాదు రిషద్ సమర్థవంతంగా కంపెనీని నడుపగలరనే పూర్తి విశ్వాసం తనకు ఉందని అన్నారు. అంతేకాదు తన కొడుకు కంపెనీని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి దాతృత్వం ఉన్న వ్యక్తిగా అజీమ్ ప్రేమ్జీ పేరు సంపాదించారు. అంతేకాదు భారత ఐటీకి సీజర్లాంటి వాడని ఐటీ ఇండస్ట్రీ అభివర్ణిస్తుంది. ఇక ప్రముఖ అంతర్జాతీయ పత్రిక టైమ్ 100 మంది ప్రభావం చూపగల వ్యక్తుల్లో ప్రేమ్జీకి కూడా చోటు కల్పించడం విశేషం. ఇలా 2004లో మరియు 2011లో ఈ గౌరవం అజీమ్ ప్రేమ్జీకి ఇచ్చింది టైమ్.
More From GoodReturns

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications