కోటికి పైగా తగ్గిన ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కస్టమర్లు: 94 లక్షలు పెరిగిన జియో యూజర్లు

రిలయన్స్ జియో ఇతర టెలికం రంగ సంస్థలకు చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు తన మార్కెట్ పరిధిని రోజు రోజుకు పెంచుకుంటుండగా, మరోవైపు ప్రధాన టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు మార్చి నెలలో వరుసగా 14.5 మిలియన్ (1.51 కోట్లు), 15.1 మిలియన్ (1.45 కోట్లు) యూజర్లను కోల్పోయింది. అదే సమయంలో జియో 9.4 మిలియన్ (94 లక్షలు) యూజర్లను పెంచుకుంది. ఇది టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డాటా.

దేశంలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో కాస్త తగ్గింది. ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 118.3 కోట్ల వైర్‌లెస్ కస్టమర్లు ఉంటే, మార్చి 31 నాటికి ఈ సంఖ్య 116.1కోట్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 65 కోట్ల మంది, గ్రామీణ ప్రాంతాల్లో 51.1కోట్ల మంది టెలికాం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మార్చి నెలలో వొడాఫోన్‌ ఐడియా 14.5 మిలియన్ ఖాతాదారులను కోల్పోవడంతో కంపెనీ మొత్తం ఖాతాదారుల సంఖ్య 39.4కోట్లకు తగ్గింది.

 Airtel loses over 14 million customers; Reliance Jio adds 9.4 million in March

ఇక మార్చి నాటికి ఎయిర్‌టెల్‌ ఖాతాదారుల సంఖ్య 15.1 మిలియన్ ఖాతాదారులను కోల్పోవడంతో దీని సబ్‌స్క్రైబర్లు 32.5 కోట్లకు పడిపోయింది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు మాత్రం కస్టమర్లు పెరిగారు. ఫిబ్రవరి చివరి నాటికి 29.7కోట్ల జియో ఖాతాదారులు ఉండగా, మార్చి 31 నాటికి ఆ సంఖ్య 30.6 కోట్లకు చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+