For Quick Alerts
For Daily Alerts
అక్షయ తృతీయ రోజున ఎన్ఎస్ఈలో స్పెషల్ ట్రేడింగ్
|
ముంబై : అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 7న కాపిటల్ మార్కెట్ విభాగంలో స్పెషల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపింది. ఈ విభాగంలో గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్టు వివరించింది, మార్కెట్ సాధారణ ట్రేడింగ్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా .. గోల్డ్ ఈటీఎఫ్లకు మాత్రం క్లోజింగ్ సేషన్ రోజువారీలా ఉండదని పేర్కొన్నది.
పెరగనున్న ట్రేడింగ్ టైం ..
ప్రీ ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4.30 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ఫ్రీ ఓపెన్ తరువాత 4.30 గంటలకు ట్రేడింగ్ మొదలై ఏడుగంటలకు ముగియనుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
English summary