For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ తృతీయ ఎఫెక్ట్: 20 శాతం పెరిగిన బంగారం ఇంపోర్ట్స్

|

భారత్‌లో జనవరి-మార్చి పీరియడ్‌లో బంగారం డిమాండ్ 5శాతం పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. 2018 తొలి క్వార్టర్లో బంగారం 151.5 టన్నులుగా ఉంది. అంతకుముందు క్వార్టర్‌తో పోల్చుకుంటే ఈ క్వార్టర్ పెరుగుదల 13 శాతం. బంగారం ధరలు ఇటీవల కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో 32,000కు పడిపోయింది. గత ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో జ్యువెల్లరీ డిమాండ్ కూడా 5 శాతం పెరిగింది.

ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా?ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా?

మే 7వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో గోల్డ్ ఇంపోర్ట్స్ 20 శాతం వరకు పెరిగింది. మార్చి నెలలో భారత్ 196.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 164.4 టన్నులు దిగుమతి చేసుకుంది. అంటే 20 శాతం ఎక్కువ. పెళ్లిళ్లు, అక్షయ తృతీయ ఉండటంతో ఇంపోర్ట్స్ పెరిగాయని చెబుతున్నారు.

Gold import increases 20 per cent ahead of Akshaya Tritiya

అక్ష తృతీయ రోజున చాలామంది బంగారం కొంటారు. దీంతో నగల వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చి, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఆఫర్లు, ధరలు జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయాలి. దుకాణాలతో పాటు గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ)ల్లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు తీసుకోవచ్చు.

English summary

అక్షయ తృతీయ ఎఫెక్ట్: 20 శాతం పెరిగిన బంగారం ఇంపోర్ట్స్ | Gold import increases 20 per cent ahead of Akshaya Tritiya

Gold imports in the March quarter went up by 20 per cent as optimistic jewellers started stocking up inventory ahead of Akshaya Tritiya. Retail demand has started picking up and a positive outlook on gold prices is expected to support 10 to 15 per cent growth in sales during Akshaya Tritiya, falling on May 7.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X