భారతదేశంలో డేటా వినియోగం, స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు డేటా ధరలు దాదాపు 95 శాతం పడిపోయాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు. 2023 నాటికి ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు 40 శాతం పెరుగుతారని, అలాగే స్మార్ట్ ఫోన్ యూజర్లు రెండింతలు అవుతారని మెక్కిన్సే నివేదికలో తేలింది. ప్రధానంగా డేటా ధరలు తగ్గుదల పట్టడమే కారణమని చెబుతున్నారు.
2025 నాటికి డిజిటల్ రంగం వ్యాపారం రెండింతలు పెరుగుతుందని, 355- 435 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. 'డిజిటల్ ఇండియా - టెక్నాలజి టు ట్రాన్స్ఫార్మ్ ఎ కనెక్షన్ నేషన్' పేరిట మెక్కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. వేగంగా పెరుగుతున్న, అలాగే అతిపెద్ద మార్కెట్ ఇండియా అని తెలిపింది. 2018 చివరి నాటికి భారత్లో 560 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని తెలిపింది.

భారత్లో మొబైల్ డాటా యూజర్లు నెలకు 8.3 గిగాబైట్లు (జీబీ) వినియోగిస్తున్నారని తెలిపింది. చైనాలో ఇది 5.5 జీబీగా ఉంది. అలాగే అడ్వాన్స్డ్ డిజిటల్ ఎకానమీ అయిన సౌత్ క1రియాలో ఇది 8 నుంచి 8.5 గిగాబైట్లు (జీబీ)గా ఉంది. మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ 1.2 బిలియన్గా ఉంది. 2018లో మొత్తం 12.3 బిలియన్ల యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు.
డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న పదిహేడు దేశాల్లో అధ్యయనం చేయగా ఇందులో భారత్ చాలా వేగవంతంగా ఉందని తెలిపింది. డిజిటలైజేషన్లో ప్రభుత్వ పాత్ర ఎంతో ఉందని పేర్కొంది. రిలయన్స్ జియో పాత్ర కూడా ఉందని పేర్కొంది. జియో వచ్చాక డేటా ధరలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. 2013 నుంచి పోల్చుకుంటే ఇప్పుడు డేటా ధరలు 95 శాతం తగ్గాయి.
2023 నాటికి ఇంటర్నెట్ యూజర్లు 750 మిలియన్ల నుంచి 800 మిలియన్ల మధ్య పెరుగుతారని, ఈ పెరుగుదల 40 శాతంగా ఉంటుందని, అలాగే స్మార్ట్ ఫోన్ యూజర్లు 650 మిలియన్ల నుంచి 700 మిలియన్ల వరకు పెరుగుతారని, ఇది రెండింతలు అని పేర్కొంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications