redBusకు ధోనీ ప్రచారం, ఈ మాజీ క్రికెటర్ బ్రాండ్ విలువ 26.9 మిలియన్ డాలర్లు
బస్ టిక్కెటింగ్ ప్లాట్ఫాం రెడ్బస్ ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రెడ్బస్ ప్రకటన చేసింది. తమ బ్రాండ్కు సంబంధించిన అన్ని ప్రసార మాధ్యమ ప్రకటనల్లో ధోనీ పాల్గొంటారని, త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల చేస్తామని రెడ్బస్ సీఈఓ ప్రకాశ్ సంగం తెలిపారు.
ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి
ఇండియన్ ఆన్లైన్ బస్ టిక్కెటింగ్ సెగ్మెంట్లో రెడ్బస్ సేవలు అందిస్తోందని, ఇది ప్రయాణీకులకు, సంస్థకు మధ్య బంధాన్ని బలపరుస్తోందని పేర్కొన్నారు. నేషనల్ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో ఎంఎస్ ధోనీ సరైన వ్యక్తి అని తమ కంపెనీ గుర్తించిందని పేర్కొన్నారు.
2006లో ఒక బస్సు సంస్థతో ప్రారంభించి, ఇప్పుడు 2,500 మందికి పైగా ఆపరేటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తూ, దేశంలోనే అతిపెద్ద, నమ్మకమైన బ్రాండ్గా రెడ్బస్ నిలిచిందన్నారు. ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియను ఎంతో సౌకర్యవంతం చేసిన రెడ్బస్తో భాగస్వామ్యం సంతోషం కలిగిస్తోందని ఎంఎస్ ధోనీ అన్నారు.
ధోనీ బ్రాండ్ విలువ ఎంత అంటే?
ధోనీ బ్రాండ్ విలువ 26.9 మిలియన్ డాలర్లుగా ఉంది. సెలబ్రిటీ బ్రాండ్ విలువ పరంగా చూస్తే 12వ స్థానంలో ఉన్నాడు. డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూలో (2018)లో ఇది వెల్లడైంది. ఫోర్బ్స్ ఇండియా బ్రాండ్ వ్యాల్యూలో 5వ స్థానంలో ఉన్నాడు.