నోట్ల రద్దు ఎఫెక్ట్: వారికి జూన్ 30వ తేదీ వరకు సీబీడీటీ డెడ్‌లైన్

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమ వద్ద ఉన్న ఆ నోట్లను అందరూ బ్యాంకుల్లో జమ చేశారు. ఎక్కువ మొత్తం కలిగిన వారు తమ వద్ద ఉన్న డబ్బుకు లెక్కలు చూపించి ఆ నోట్లను జమ చేయాలి. పెద్ద మొత్తంలో జమచేసి లెక్కలు చూపని వారికి నోటీసులు జారీ చేశారు. అందులో చాలామంది లెక్కలు చూపించారు. మరో 80,000 మంది వరకు లెక్కలు చూపించలేదు.

దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) లెక్కలు చూపని వారికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించింది. నోట్ల రద్దుకు సంబంధించి లెక్కలు చూపని వారిపై కేసులు నమోదు చేశారు. వీటన్నింటిని క్లోజ్ చేసేందుకు లెక్కలు చూపించాలని ఎనబై వేల మందికి తుది గడువు విధించింది. ఈ మేరకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ (ఐటీడీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని కూడా అప్రోచ్ కానుంది. కంపెనీలపై చట్టపరమైన చర్యలను కోరనుంది.

Disposing demonetisation cases: CBDT sets June 30 deadline for assessment

నోట్ల రద్దు సమయంలో పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేసిన 80 వేల కంపెనీలు లేదా వ్యక్తులు ఇప్పటి వరకు ట్యాక్స్ డిపార్టుమెంట్ పంపించిన నోటీసులకు సమాధానం చెప్పలేదని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ కంపెనీలు స్టక్ ఆఫ్ ఎదుర్కొంటున్నాయి. కేసుల విముక్తికి సీబీడీటీ జూన్ 30వ తేదీ వరకు సమయం ఇచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+