బీఎస్ఎన్ఎల్ షాక్: 54,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్, అప్పటి దాకా వెయిటింగ్
చేదవార్త! ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో దాదాపు 31 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. దాదాపు 54 వేలమంది ఉద్యోగులను తొలగించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వేలాది మందిని ఉద్యోగం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనకు అంగీకారం వచ్చిందట.
రైలులో ప్రయాణించేటప్పుడు ఫుడ్ ఇలా ఆర్డర్ చేయండి
ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బోర్డు నిరీక్షిస్తోందట. ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సూచించిన పది సూచనల్లో మూడింటిని గత మార్చి నెలలో బీఎస్ఎన్ఎల్ బోర్డు అప్రూవ్ చేసిందట.
అయితే డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సూచనను పక్కన పెట్టాలని భావిస్తోందట.
వీఆర్ఎస్ కోరడం, ఉద్యోగులను తొలగించడం లేదా టెలికం కంపెనీకి చెందిన బిజినెస్ను మూసివేయడం వంటివి చేస్తే ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని, తద్వారా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని, అందుకే డీవోటీ వేచి చూడాలని నిర్ణయించుకుందని చెబుతున్నారని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, కమిటీ ఇచ్చిన సూచనల్లో కొన్నింటిని బీఎస్ఎన్ఎల్ బోర్డు అంగీకరించింది. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, 50 ఏళ్లకు పైబడిన వారికి వీఆర్ఎస్, 4జీ స్పెక్ట్రం కేటాయింపులు బీఎస్ఎన్ఎల్కు వచ్చేలా చేయడం వంటి సూచనలు చేసింది.
అయితే బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగాలు తొలగించడం అంటే ట్విస్ట్ ఉంది. 50 ఏళ్ల పైబడిన వారి వీర్ఎస్ కోరడం, రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించడం ద్వారా దాదాపు 54,451 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోవచ్చునని అంటున్నారు. బీఎస్ఎన్ఎల్లో 1,74,312 మంది ఉద్యోగులు ఉన్నారు. 54 వేల మంది అంటే ఇది 31 శాతం.
కేవలం రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం వల్లనే రానున్న ఆరేళ్లలో 13,895 కోట్లను సేవ్ చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ తగ్గిస్తే 33వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగుల యావరేజ్ వయస్సు 55. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లు తమ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది.