గుడ్ న్యూస్: ఇన్కం ట్యాక్స్, జీఎస్టీ ఆఫీసులు ఈ రోజు తెరిచే ఉంటాయి
నేటితో (మార్చి 31) 2018-19 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇయర్ ఎండ్ కలెక్షన్స్లో సహకరించేందుకు గాను ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ కార్యాలయాలు శనివారం, ఆదివారం తెరిచే ఉంచారు. పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసే నిమిత్తం సెలవు దినమైన ఆదివారం కూడా ఈ కార్యాలయాలు తెరుస్తున్నారు. శనివారం కూడా తెరిచారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ధరలు పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి!
పన్నులు చెల్లించేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరి వారాంతంలో (మార్చి 30, 31 తేదీల్లో) కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు (సీబీఐసీ) సంబంధించి అన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయని సీబీఐసీ అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. పన్ను చెల్లింపుదార్లు రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమస్యలు ఉండకుండా చివరి రెండు రోజుల్లో అవసరమైనచోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీబీడీటీ తన కార్యాలయాలకు సూచించింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు: మార్చి 31.. ఈ ఆదివారం కూడా ఆ బ్యాంకులు తెరిచే ఉంటాయి
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆలస్యం చేసిన లేదా సవరించిన రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ మార్చి 31. ఆర్థిక సంవత్సరం ఆఖరి రెండ్రోజులు శని, ఆదివారాల్లో వచ్చాయి. దీంతో ఆదాయపు పన్ను విభాగ కార్యాలయాలు అన్నిసాధారణ పనివేళల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తాయని సీబీడీటీ తెలిపింది.