బ్రిటన్కు చెందిన ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ గో-జీరో మొబిలిటీ భారత మార్కెట్లోకి తన బైక్స్ను ప్రవేశపెట్టింది. రెండు రకాల ఎలక్ట్రిక్ బైక్స్ను అందుబాటులోకి తెచ్చింది. మైల్, వన్ పేర్లతో ఈ రెండు విద్యుత్ బైక్లను బుధవారం ప్రవేశపెట్టింది.
ఇందులో మైల్ బైక్ ధర రూ.29,999 కాగా, వన్ ధర రూ.32,999గా ఉంది. వన్ బైకులో ఉన్న 400 వాట్ల లిథియమ్ బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 60 కి.మీ., అలాగే మైల్ బైకులో ఉన్న 300 వాట్ల లిథియమ్ బ్యాటరీతో 45 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.
ఈ బైక్ను దేశీయంగా తయారు చేయడానికి కోల్కతా కేంద్రస్థానంగా విధులు నిర్వహిస్తున్న కీర్తి సోలార్తో చేతులు కలిపింది. ఈ బైక్స్ను భారత్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల కోసం రూపొందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గో-జీరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ మాట్లాడారు. విద్యుత్తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని, ముఖ్యం గా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని చెప్పారు. తాము తెచ్చిన రెండు ఈ -బైక్స్ భారత్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల కోసం అన్నారు.
మొదటి సంవత్సరంలో మూడు వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రానున్న అయిదేళ్లలో 75 వేల యూనిట్లకు పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్లతో పాటు డెలివ్ ఆర్, వన్ డబ్ల్యూ, జిరో స్మార్ట్ బైకులను కూడా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. ఈ బైక్స్ను విక్రయించడానికి ప్రీమియం రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడతలో ఢిల్లీ, కోల్కతా, గౌహతిలో ప్రారంభిస్తామన్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగా రానున్న మూడేళ్లలో 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కోల్కతాలో ఏర్పాటు చేసిన యూనిట్లో ఏడాదికి 20 వేల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. కాగా, భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులను కూడా భారత్లోనే అభివృద్ధి చేసి తయారు చేయనున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications