ఎన్నికలు: 23వేల ఉద్యోగులను కాపాడేందుకు కేంద్రం కసరత్తు!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన కొన్ని విమానాలను తీసుకోవాల్సిందిగా స్పైస్ జెట్ను అడిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 40 విమానాలు తీసుకునేందుకు స్పైస్ జెట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెబుతున్నారు. మిగతా విమానయాన సంస్థలతోను కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
యాజమాన్య మార్పు: జెట్ ఎయిర్వేస్లో సరికొత్త పరిణామం
జెట్ ఎయిర్వేస్లో 23వేల ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ మూతబడితే ఉద్యోగులు రోడ్డుపాలవుతారు. ఎన్నికలకు ముందు ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర అంశమే. అంతేకాదు, వారి ఉద్యోగాలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఇటీవలి వరకు ఇండియాలో రెండో అతిపెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ జెట్ ఎయిర్వేస్. ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. బోయింగ్ కంపెనీకి చెందిన 737 విమానాలను స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ మాత్రమే నడుపుతున్నాయి. స్పైస్ జెట్.. బిజినెస్, ఎకనామీ కేటగిరీల్లో విమానాలను నడిపిస్తోంది. విమానాలను తీసుకునే అంశంపై స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.