సన్ షైన్ ఆసుపత్రి వాటాలను కోనుగోలు చేయనున్న కిమ్స్,
హైద్రబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న అతి పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి సన్ షైన్ ను మల్టి స్పెషాలిటి అసుపత్రి కిమ్స్ కొనుగోలు చేయబోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి..మోకాళ్ల శస్త్ర్ర చికిత్సలో సన్ షైన్ పేరుగడించింది..ఈ అసుపత్రిని 2009 లొ డా.గురువారెడ్డి స్థాపించారు ..అనంతరం ఇది అన్ని విభాగాల్లో వైద్యాన్ని అందించే స్థాయికి చేరింది..కాగా సన్ షైన్ ఆసుపత్రులు సికింద్రాబాద్ తోపాటు మాదాపూర్, కరీంనగర్, భువనేశ్వర్ లో ఉన్నాయి.
అయితే మొత్తం ఆసుపత్రుల్లో 70 శాతం వాటాను సన్ షైన్ అమ్మేందుకు మంతనాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు..కాగా ఈ చర్చలు ప్రాధమిక దశలో ఉన్నట్టు తెలుస్తోంది..కాగ దీని మొత్తం 500 కోట్ల రుపాయలు ఉండనుండగా అందులో 70 శాతం విలువను అమ్మనుంది. ఇక 2004 లొ డాక్టర్ భాస్కర్ రావు 2004 లొ కిమ్స్ స్థాపించారు..అనంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పలు బ్రాంచిలను కల్గి ఉంది..అయితే రెండు ఆసుపత్రులు వీలినం తర్వాత కొన్నాళ్లపాటు విడివిడిగా నే సేవలు అందిస్తారని సమాచారం.