పాత పన్నులు సైతం వసూల్ చేశాం
పన్నుల విధానంలో జీఎస్టి అమలుతోపాటు పన్నుల వసూళ్లకు పకడ్భంధి ప్రణాళిక రూపోందించడంతో కమర్షియల్ టాక్స్ లో పన్ను రాబడులు ఎనబై శాతం వరకు చేరుకున్నాయి..దీంతో టార్గెట్ సుమారు 41 వేల కోట్ల రుపాయలు గత ఆర్ధిక సంవత్సరంలో వసూలు చేసింది.
బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు
పన్నుల రాబడిలో టార్గెట్ రీచ్ అయిన కమర్షియల్ టాక్స్ విభాగం
కేంద్ర ,రాష్ట్ర్రాలకు అధిక ఆదాయం సంపాదించిపెడుతున్న పన్నుల్లో కమర్షియల్ టాక్స్ లు ఒకటి .వీటని ఎంతో పకడ్బందిగా వసూలు చేస్తే గాని ఖాజాన నిండని పరిస్థితి. ఈనేపథ్యంలోనే కమర్షియల్ టాక్స్ జిఎస్టి విభాగం పన్నుల వసూళ్ల పూర్తి లక్ష్యానికి చేరుకున్నాయి.ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 52వేల 438 కోట్ల రుపాయల లక్ష్యం పెట్టుకోగా ఫిబ్రవరి నాటికి రూ. 40 వేల 690 కోట్ల రుపాయలు వసూలు చేసి ఎనబైశాతం లక్ష్యానికి చేరువైంది. ఇది ఈ ఆర్దిక సంవత్సరంలో 17 శాతం వృద్ది సాధించింది.
45 శాతం ఎక్సైజ్, పెట్రోలియం నుండే ఆదాయం
జీఎస్టి పరిధిలో లేకపోవడంతో పెట్రోలియం ఉత్పత్తులు,ఎక్సైజ్ శాఖల నుండి ఎక్కువ శాతం ఆదాయం వస్తుంది.మొత్తం రాబడుల్లో 45 శాతం వీటి నుండే వచ్చాయి,కాగా పన్ను వసూళ్లలో వ్యక్తులు ,సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యం అయిందని అధికారులు వివరించారు. నిత్యం వాహనాల తనిఖీలు ,దాడులు , కేసుల నమోదుతో ఈ సంవత్సరం నాలుగు వేలకు పైగా వాహనాలను తనిఖీ చేసి ,వందకు పైగా వెహికిల్స్ ను అదుపులోకి తీసుకుని జరిమాన విధించినట్టు కమర్షియల్ టాక్స్ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.
ఎగవేతలకు అడ్డుకట్ట వేసి బకాయిలపై దృష్టి
మరోవైపు ఎగవేతలకు అడ్డుకట్ట వేసి బకాయిలపై దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలోనే పన్నుఎగవేతలకు అడ్డుకట్ట వేసి ,పాతబకాయిలపైదృష్టి సారించి వ్యాపారులందరిని పన్ను పరిధిలోకి తీసుకురావడంతో ఆదాయం పెరిగింది. దీంతో పాటు పన్నుల విధానాన్ని కంప్యూటరైజ్డ్ చేయడం రిటర్నులు ,రీ ఫండ్ల విషయంలో సింగిల్ విండో విధానం,దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కావడం కూడ రాబడి పెరుగుదలకు దోహదపడ్డాయి,రాష్ట్ర్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాట్, కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టి కలిపి పన్ను రాబడిని పెంచుతున్నాయి.జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రాబడులు పెరుగుతున్నాయి.