జెట్ ఎయిర్ వేస్ 650 కోట్ల రుపాయలు ఎగ్గోట్టింది.
గత ఆరునెలలుగా సంక్షోభం కారణంగా నిధుల కొరతతో సతమతవుతుంది జెట్ ఎయిర్ వేస్.ఈనేపథ్యంలోనే ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లకు ,మరియు ఆయిల్ కంపనీలకు బకాయిలు చెల్లించలేక పోతుంది. దీంతో విమానాలను సైతం రద్దు చేసుకుంటుంది..అయితే తాజాగా పన్నుల ఎగవేతకు సంభందించి మరో ఆరోపణ ఎదుర్కోంటుంది..జెట్ ఎయిర్ వేస్...
కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్ కు మరో కష్టం వచ్చిపడింది..సుమారు 650 కోట్ల రుపాయల పన్నులు ఎగవేసేందుకే దాని అనుబంధ సంస్థల మధ్య లావాదేవిలు అనుమానస్పదంగా ఉన్నాయంటూ ఐటి శాఖ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే 650 కోట్ల రుపాయల పన్నులను ఎగ్గేందుకు ఇలా చేసి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు..అందుకే జెట్ ఎయిర్ వేస్ పై నివేదికను తయారు చేశారు..దీనికి సంభంధించి త్వరలోనే నోటిసులు పంపే అవకాశలు కనిపిస్తున్నాయి..నోటిసులపై జెట్ ఎయిర్ వేస్ సమాధానం సంతృప్తికంగా లేకపోతే పన్ను నోటీసులు పంపనున్నారు..మాకు ఎలాంటీ నోటీసులు రాలేదు...
అయితే జెట్ ఎయిర్ వేస్ మాత్రం దీనికి సంబంధించి ఎలాంటీ నోటీసులు రాలేదని తెలిపింది.కాగా ఈ కంపనీ ప్రతి సంవత్సరం పన్నులు చెల్లించేందుకు దుబాయ్ లోని జనరల్ సేల్స్ ఏజెంట్ కు కమీషన్ చెల్లిస్తోంది.అయితే ఈ ఏజెంట్ జెట్ దుబాయ్ కంపనీలో ఓక భాగంగా ఉందని అటి అధికారులు చెబుతున్నారు. కాగా దర్యాప్తు సంధర్భంగా జెట్ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. కాగా నిధులను విదేశాలకు పంపించడం ద్వార పన్నులను ఎగ్గోట్టారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.