ఓట్ అన్ అకౌంట్ బడ్జెను అసెంబ్లిలో ప్రవేశపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్...

హైదరాబాద్ : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు... ఈ బడ్జెట్ లో 1,82,017 కోట్లను ప్రతిపాదించారు... ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినా .. ఎవరికీ ఆర్థికశాఖ కేటాయించకపోవడంతో అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్, బడ్జెన్ ప్రవేశ పెట్టారు..కాగా మండలిలో మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. కాగా రాష్ట్రంలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్.... రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు

లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్.... రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు

ఓట్ ఆన్ బడ్జెట్‌ రూ.1,82,017 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.32,815 కోట్లని .. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లుగా ప్రకటించారు..

గణనీయమైన వృద్ధి

గణనీయమైన వృద్ధి

సిఎమ్ కేసిఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను వివరించారు..ప్రధానంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు పెర్కోన్నారు...కాగా రాష్ట్ర. వృద్ధి రేటు 10.6 శాతం సాధించడమే ఇందుకు నిదర్శమని తెలిపారు.

వ్యుద్యాప్య పెన్షన్ 2016 ,వికాలాంగులకు 3016 అమోదించిన సభ...

వ్యుద్యాప్య పెన్షన్ 2016 ,వికాలాంగులకు 3016 అమోదించిన సభ...

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,016కు పెంచుతున్నామని సభలో ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,016 .. వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారాయన.

దేనికి ఎంత.....

దేనికి ఎంత.....

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫికి రూ.6 వేల కోట్లు కేటాయించారు....వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లు, నీటిపారుదలశాఖకు రూ.22,500 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు కగా ,ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు కేటాయించారు. , ఎస్సీల సంక్షేమానికి రూ.16,581 కోట్లు , ఎస్టీల సంక్షేమం రూ.9,827 కోట్లు ,మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. . . సన్న బియ్యం రాయితీ కోసం రూ.2,774 కోట్లు , ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు , ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536 కోట్లు ,ప్రకటించారు కేసీఆర్.

రైతుకు అండగా

రైతుకు అండగా

ఇదివరకు మాదిరిగానే రైతులకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. రైతు బీమా కోసం రూ.650 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు ఈ పథకంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందజేస్తారు. రైతు బంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. గతేడాది ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఈ ఏడాది నుంచి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. ఇస్తామని పద్దులో ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం గంటపాటు బడ్జెట్ ప్రసంగించగా .. సభ్యులు బల్లచరిచి అభినందనలు తెలిపారు. చివరగా జై హింద్, జై తెలంగాణ అనే నినాదాలతో కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+