48 గంటల్లోనే పుల్వామా భాదిత కుటుంభాలకు ఎల్ఐసి సెటిల్ మెంట్లను అందించిన ఎల్ఐసి
హైద్రబాద్ ..దేశం మొత్తం నిర్ఘంతపోయిన పుల్వామా సంఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు..పుల్వామా భాదితకుటుంభాలకు తమకు చేతనైన సహయం చేస్తున్న ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రైవేట్ రంగాలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి..ప్రధానంగా పుల్వామా భాధిత కుటుంభాలను ఎంత త్వరగా అదుకుంటే అంత త్వరగా వారు కోలుకునే అవకాశం ఉంది...
ఈనేపథ్యంలోనే పుల్వామాలో మృతి చెందిన జవాన్ కుటుంభాలపై భారత ప్రభుత్వ జీవిత బీమా సంస్థ అత్యంత వేగంగా స్పందించింది... జవాన్ల జీవిత బీమా క్లెయిమ్ సెటిల్ మెంట్లను క్లియర్ చేసింది..సైనికులు చనిపోయిన కొద్ది గంటల్లోనే వారి కుటుంభాలకు అందజేసింది.. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హెచ్ గురు అనే సీఆర్పీఎఫ్ జవాన్కు చెందిన మూడు జీవిత పాలసీల క్లెయిమ్ల సెటిల్మెంట్ మొత్తాన్ని గురు తండ్రి హొన్నయ్య, తల్లి చిక్కతాయమ్మలకు అందజేసింది...ఈనేపథ్యంలోనే గతంలో జరిగిన కరీంనగర్, మైసూరు బస్సు ప్రమాదం, ఎల్ఐసీ ఇలానే వేగంగా స్పందించి మృతుల కుటుంబాలకు బీమా పరిహారం అందజేసిన విషయాన్ని సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ గుర్తు చేశారు.