అమెరికా లో 129 మంది ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్?
భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ లో నివసించే విద్యార్ధి వీసా గడువు తీరిపోయిన కూడా నకిలీ యూనివర్సిటీల ద్వారా ఎన్రోల్ చేసుకున్నారనే కారణంగా 129 మంది భారతీయ విద్యార్థులకు జైలు శిక్ష విధించారు.
భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ లో నివసించే విద్యార్ధి వీసా గడువు తీరిపోయిన కూడా నకిలీ యూనివర్సిటీల ద్వారా ఎన్రోల్ చేసుకున్నారనే కారణంగా 129 మంది భారతీయ విద్యార్థులకు జైలు శిక్ష విధించారు. విదార్థుల తరపున వాదించే న్యాయవాదులు, మాట్లాడుతూ ఇమిగ్రేషన్ పద్ధతులు పాటించని నకిలీ యూనివర్సిటీల గురించి విదార్థులకు తెలియదు అన్నారు.

డెట్రాయిట్ ఫార్మింగ్టన్ హిల్స్లో అనేది US సంయుక్త రాష్ట్రాల హోంల్యాండ్ సెక్యూరిటీ యొక్క రహస్య విభాగం, ఇమ్మిగ్రేషన్ మోసాన్ని బహిర్గతం చేయడానికి అండర్ కవర్ ఆపరేషన్ చేసిందని ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఆరోపణలు చేసారు.
"పే-టు-స్టే" స్కీం గా పిలవబడిన దానిలో, విద్యార్ధులు తమ విద్యార్థుల వీసాని నిర్వహించడానికి మరియు US లో తిరిగి ఉండడానికి నకిలీ విశ్వవిద్యాలయాలను సంప్రదించారని తెలిపారు.
పౌర ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలకు సంబంధించి 130 మంది విదేశీ పౌరులు ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) అధికారికంగా అరెస్టు చేసినట్లు తెలిపింది.అరెస్టు ఐన 130 మంది లో, 129 మంది భారతీయులు ఉన్నారు 'అని ICE ప్రతినిధి ఖలీద్ హెచ్ వాల్స్ తెలిపారు. వీరికి సంబందించిన పూర్తి వివరాలు అందేవరకు నిర్బంధంలో ఉంచుతామని అన్నారు.
సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కేసును చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అరెస్టు ఐన విద్యార్థుల హోదాకు సంబంధించిన ప్రశ్నలకు MEA ఒక హెల్ప్లైన్ను కూడా తెరిచింది.
భారత విద్యార్థులపై ఇటీవలి సంవత్సరాలలో ఈ కేసు అతి పెద్దది అని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications