గోసంరక్షణకు కామధేను యోజన పథకం: బడ్జెట్‌లో రూ. 750 కోట్లు కేటాయింపు

2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆవులను పరిరక్షిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కావడంతో ఇందులో గోవులను పరిరక్షించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టని 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో గోసంరక్షణకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద రూ.750 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది.

రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కింద గోవుల సంరక్షణ, గోవుల పెంపకంలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తోంది. గోసంరక్షణలో భాగంగా చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా ఆయోగ్ సమీక్షలు చేస్తుంది.

Modi govt announces Kamdhenu Yojana for cows: Allocates Rs. 750 crore

ఇక ఇప్పటికే గోవులను సంరక్షించేందుకు రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వాలు గోసంరక్షణ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. గోవులను సంరక్షించేందుకు ఈ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాత్రం ఓటమి చవిచూసింది. ఇక గోసంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు.

ఇక ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చాలా కీలక వర్గాలకు ఊరట కలిగించారు. ముఖ్యంగా వేతన జీవులకు పన్ను మినహాయింపును రూ.5లక్షలు చేశారు. మరోవైపు రైతులకు కూడా ఎన్నికల ముందు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకంలానే దేశవ్యాప్తంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలను నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+