2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆవులను పరిరక్షిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కావడంతో ఇందులో గోవులను పరిరక్షించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టని 2019-20 మధ్యంతర బడ్జెట్లో గోసంరక్షణకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద రూ.750 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది.
రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కింద గోవుల సంరక్షణ, గోవుల పెంపకంలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తోంది. గోసంరక్షణలో భాగంగా చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా ఆయోగ్ సమీక్షలు చేస్తుంది.

ఇక ఇప్పటికే గోవులను సంరక్షించేందుకు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో అప్పటి బీజేపీ ప్రభుత్వాలు గోసంరక్షణ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. గోవులను సంరక్షించేందుకు ఈ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాత్రం ఓటమి చవిచూసింది. ఇక గోసంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు.
ఇక ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో చాలా కీలక వర్గాలకు ఊరట కలిగించారు. ముఖ్యంగా వేతన జీవులకు పన్ను మినహాయింపును రూ.5లక్షలు చేశారు. మరోవైపు రైతులకు కూడా ఎన్నికల ముందు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకంలానే దేశవ్యాప్తంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలను నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications