For Quick Alerts
For Daily Alerts
స్వల్పలాభాలతో ముగిసిన మార్కెట్లు
ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య దోబూచులాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
|
ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య దోబూచులాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజు మొత్తం స్వల్ప స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 33,588 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,349 వద్ద స్థిరపడింది. మార్కెట్లకు ప్రధానంగా పెద్ద కంపెనీలయిన ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్ దన్నుగా నిలిచాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ(1.31%), టెక్నాలజీ(0.84%), మూలధన వస్తువులు(0.45%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.43%) లాభపడగా, మరో వైపు లోహ, వాహన, మౌలిక రంగాలు స్వల్పంగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడ్డ, నష్టపోయిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. లాభపడిన వాటిలో ఇన్ఫోసిస్(2.58%), సన్ ఫార్మా(1.77%), రిలయన్స్ ఇండస్ట్రీస్(1.75%), ఐషర్ మోటార్స్(14.6%), టెక్ మహీంద్రా ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.3%), అదానీ(1.79%), ఇండియా బుల్స్ హౌసింగ్(1.61%), బజాజ్ ఆటో(1.47%), గెయిల్ ఇండియా(1.31%) ప్రముఖంగా ఉన్నాయి.దేశంలో టాప్ 10 టెలికాం కంపెనీలు
Comments
English summary