ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన అది భారత్లో నియామకాలపై ప్రభావం చూపదని కంపెనీ సీఈవో విశాల్ సిక్కా అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లోనూ, ఆద
ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన అది భారత్లో నియామకాలపై ప్రభావం చూపదని కంపెనీ సీఈవో విశాల్ సిక్కా అన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లోనూ, ఆదాయంలోనూ అంచనాలను మించి కంపెనీలను రాబట్టిన తర్వాత పలు అంశాలపై విశాల్ సిక్కా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే కొన్నేళ్లలో అమెరికాలో స్థానికంగా దాదాపు 10 వేల మందిని నియమించుకునే ప్రక్రియతో భారత్లో జరిగే నియామకాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మన దేశంలో ఈ సంఖ్య రెండు త్రైమాసికాలకు సంబంధించిన దాని కన్నా ఎక్కువేం కాదన్నారు. కంపెనీ ఇప్పటికే క్యాంపస్ నియామకాల ద్వారా 19వేల మందిని నియమించుకుందని చెప్పారు. భారత్లో నియామకాలు నెమ్మదించలేదు. "మేము అమెరికాలో రెండేళ్లలో 10వేల మంది ఉద్యోగాల గురించి చెప్పాం. అదే భారత్లో రెండు త్రైమాసికాల కంటే తక్కువ సమయంలోనే 10 వేల మందిని తీసుకుంటాం." అని విలేకరులకు చెప్పారు.

జూన్ వరకూ దాదాపు 10 మంది కొత్తగా కంపెనీలో చేరారని ఆ సంస్థ సీవోవో ప్రవీణ్ రావు తెలిపారు. కంపెనీ ఇంకా 12వేలు లేదా 13 వేల మందిని కొత్తగా తీసుకునే అవకాశముందని సమాచారం. జూన్ నెల చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,98,553గా ఉంది. జీత భత్యాల గురించి సీఎఫ్వో ఎండీ రంగనాథ్ స్పందిస్తూ కంపెనీ మంచి వేరియబుల్ పే ప్రకటించిందని అన్నారు. దీని ద్వారా కంపెనీ మార్జిన్పై 1శాతం మేర ప్రభావం ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications