కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వాన్సులు, విత్డ్రావెల్స్కు సంబంధించి కనీసం 15 రోజుల వ్యవధిలోనే వారు కోరిన మొత్తాన్ని ఆమోదించాలని స్పష్టం చేసింది.ఇంతకుముందు దీనికి సంబంధించి నిర్దిష్టమైన గడువు లేదు. ప్రస్తుతం ఉన్న జిపిఎఫ్ నిబంధనలు 1960లోనే అమలులోకి వచ్చాయని, ఇప్పటివరకూ కొన్ని సవరణలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం అవసరమైన మార్పులను చేయాల్సి వచ్చిందని సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

ఈ మార్పుల వల్ల జిపిఎఫ్ రుణాలు తీసుకునే ప్రక్రియ మరింత సులువు అవుతుందని, అదే విధంగా ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువులకు కూడా అడ్వాన్సులు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. అలాగే అడ్వాన్సులు, విత్డ్రావెల్స్కు సంబంధించి డాక్యుమెంటరీ ప్రూఫ్ నిబంధనను తొలగించినట్లు చెప్పుకొచ్చారు. కేవలం సదరు చందాదారు ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందని, 15 రోజుల్లోనే రుణాల ఆమోదం, చెల్లింపు జరిగిపోతుందని వెల్లడించారు. ఇక అస్వస్థతకు సంబంధించి ఏడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గృహ రుణం కోసం ఉద్యోగులు ఉపసంహరించుకునే మొత్తాన్ని 90 శాతానికి పెంచామన్నారు. వాహనాలు లేదా కారు కొనుగోళ్లకు నాలుగింట మూడొంతుల మొత్తాన్ని చందాదారు ఖాతాలో మిగిలిన మొత్తం నుంచి చెల్లిందుకు వీలుంటుందని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications