2017-18 సంవత్సర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉందని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది కార్పొరేట్ పన్నును చెప్పుకోదగ్గ స్థాయిలో
పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్యులతో పాటు పరిశ్రమల వృద్దిలో స్వల్ప మందగమనం ఏర్పడింది. డిమాండ్లో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2017-18 సంవత్సర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉందని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది కార్పొరేట్ పన్నును చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించే అవకాశం ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది పేర్కొన్నారు.

పన్ను రేట్లు తగ్గించడం సమంజసమే
నల్లధనాన్ని అన్ని విధాలా తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, ఇలాంటి సమయంలో పన్ను రేట్లు తగ్గించడం సమంజసమేనని డెలాయిట్ నివేదికలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వానికి వచ్చే రాబడిలో కార్పొరేట్ పన్ను ద్వారా సమకూరే ఆదాయం 19 శాతం మేర ఉంది. ఆదాయపు పన్ను వాటా 14 శాతంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిమాండ్ బాగా తగ్గి, ఆర్థిక వ్యవస్థలో వృద్ది క్షీణిస్తుందన్న భయాలు నెలకొన్నాయి.

డిమాండ్పై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు
ఈ నేపథ్యంలో డిమాండ్పై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో తగిన చర్యలను చేపట్టవచ్చని సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. పన్ను ప్రోత్సాహకాలను పూర్తిగా ఎత్తివేయడం మంచి నిర్ణయమని 40 శాతం మంది అన్నారు. వృద్దికి దోహదపడే మౌలిక, గ్రామీణాభివృద్ది తదితర రంగాలకు పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించాలని మెజారిటీ ప్రజలు అభిలషించారు. మౌలిక రంగానికి ప్రోత్సాహకాలను తొలగించకుండా పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించేందుకు గాను పెట్టుబడితో అనుసంధానించవచ్చని సూచించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే ప్రయోజనాన్ని అభివృద్ది కోసం వినియోగించాలని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల డిమాండ్ పుంజుకునే అవకాశం ఉంటుందని 66% మంది పేర్కొన్నారు. ప్రభుత్వం ఈసారి సబ్సిడీ వ్యయాలను పెంచే అవకాశం ఉందని ఆరు శాతం మంది అభిప్రాయపడ్డారు.

పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలి: టూర్ ఆపరేటర్లు
విదేశీ మారక రాబడులపై సేవా పన్నును మినహాయించాలని ట్రావెల్,టూర్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పొరుగు దేశాలు నిర్ణయించిన జిఎస్టి/వ్యాట్ను దృష్టిలో ఉంచుకుని దేశీయ టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లపై జిఎస్టి రేటును నిర్ణయించాలని సూచిస్తున్నారు.

కస్టమ్స్ సుంకాన్ని పెంచాలి: కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ
దిగుమతులు తగ్గే విధంగా బేసిక్ కస్టమ్స్ సుం కాన్ని రెండింతలు పెంచి 20 శాతానికి చేర్చాలని అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ పరిశ్రమ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతోంది. ఈ చర్య వల్ల దిగుమతులు తగ్గడమేకాకుండా దేశీయంగా మాన్యుఫ్యాక్చరింగ్ పెరగడానికి అవకాశంఉంటుందని పేర్కొంది. తయారీ ప్రణాళికను అమలు చేసి విడిభాగాల తయారీని పెంచాలని కోరారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications