పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన నేపథ్యంలో 24 గంటలల్లోపే బ్యాంకులు స్పందించాయి. ప్రాధాన్యత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్
పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన నేపథ్యంలో 24 గంటలల్లోపే బ్యాంకులు స్పందించాయి. ప్రాధాన్యత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ప్రామాణిక రుణ రేటును 0.9 శాతం తగ్గించింది. దీంతో వివిధ టర్మ్ రుణాల వడ్డీ రేట్లన్నీ కూడా ఆ మేరకు తగ్గనున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.7 శాతం మేర తగ్గించగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 0.65 శాతం నుంచి 0.9 శాతం దాకా తగ్గించింది. రాబోయే రోజుల్లో మిగతా బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కన్పిస్తున్నాయి. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ కొత్త వడ్డీ రేట్లు(ఎంసీఎల్ఆర్) జనవరి 1నుంచి అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలావధి కల రుణాలపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ చర్య తీసుకుంది. అలాగే రెండేళ్ల కాలావధి కలిగిన రుణాలకు వడ్డీ రేటు 8.10 శాతంగా, మూడేళ్ల కాలావధి రుణాలకు 8.15 శాతంగా ఉంటుందని కూడా ఎస్బిఐ ఆ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications
