ప‌ని మొద‌లుపెట్టిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది.

నల్లధనంపై దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన పది రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ భారీ నగదు లావాదేవీలపై నోటీసులు జారీ చేసింది. న‌వంబ‌రు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్లను తక్కువ మొత్తంలోనే మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడానికి రూ. 2.5 లక్షలకు పైగా డబ్బును బ్యాంకులో జమ చేసిన ఖాతాలపై ఆదాయ పన్ను శాఖ గురి పెట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ఖాతాల్లో భారీ నగదు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు నివేధికలు తెప్పిస్తూనే ఉంది.

 ప‌ని మొద‌లుపెట్టిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

దీనిలో భాగంగానే సిక్కింలోని గ్యాంగ్‌ట‌లోని సీతారామ్ ఎంటర్ ప్రైజెస్‌కు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కింకు చెందిన సితారామ్ ఎంటర్ ప్రైజెస్ ఖాతాలో నవంబర్ 12 నుంచి 14 మధ్య జరిపిన లావాదేవీలపై ఈ నెల 25న వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొంది. నవంబర్ 13న సదరు కంపెనీ బ్యాంకు ఖాతాలో 4,51,000 రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సమర్పించవల్సిందిగా సిలిగురి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదాయపన్ను చెల్లించినట్టయితే దానికి సంబందించి నఖలును సమర్పించాలని నోటీసులో పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+