38 శాతం: మొబైల్ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ టాప్

ముంబై: భారత దేశపు అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల మార్కెట్‌లో 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉందని ఎస్‌బీఐ తెలిపింది.

డిసెంబర్ 2015 నాటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న గణాంకాల ప్రకారం వాల్యూమ్ పరంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో 38.44 శాతం, విలువ పరంగా సుమారు 36 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొంది.

SBI leads mobile banking chart with over 38% market share

గత డిసెంబర్‌లో రూ. 17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ లావాదేవీలు వాల్యూమ్ పరంగా 70 లక్షలకు, యాక్సిస్ బ్యాంక్ 60 లక్షలకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 39 లక్షలకే పరిమితమయ్యాయి.

మొబైల్ బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఏస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ 2015 ఏప్రిల్ నుంచీ తాము అగ్రస్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. గతేడాది మే నెలలో స్టేట్‌బ్యాంక్ ఎనీవేర్-సరళ్ పేరుతో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఎస్‌బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+