చాండిల్య రాజీనామా వార్తలన్నీ పుకార్లే: ఎయిర్ ఏషియా చీఫ్

చెన్నై: భారత్‌లో చౌక ధరలకే విమానయాన సేవలను అందిస్తోన్న సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ మిత్తు చాండిల్య రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆ గ్రూపు చీఫ్ టోర్నీ ఫెర్నాండెజ్ ఖండించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చాండిల్య ఎయిర్ ఏషియాని వీడట్లేదని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.

మేకిన్ ఇండియా వీక్‌లో పాల్గొన్న ఫెర్నాండెజ్ ఈ విషయంపై మీడియా ప్రతినిధులతో స్పందిస్తూ చాండిల్య రాజీనామా చేశారని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. అనంతరం కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి వివరించారు. త్వరలో రెండు కొత్త విమానాలను, ఆ తర్వాతి కాలంలో డజను విమానాలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

Mittu Chandilya not quitting AirAsia India: Tony Fernandes

అయితే ఈ విమానాలను నిర్దిష్ట కాలపరిమితికి ఎప్పటిలోగా డెలివరీ తీసుకోనున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఎయిర్ ఏషియా ఇండియా ఆరు ఎయిర్‌బస్ ఏ320-200 విమానాలతో భారత్‌లో సేవలందిస్తున్నది.

మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియా గ్రూపు, టాటా సన్స్, టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌కు చెందిన అరుణ్ భాటియా భాగస్వామ్యంలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యంలో ఎయిర్ ఏషియాకు 49 శాతం, టాటా సన్స్‌కు 41 శాతం, భాటియాకు మిగతా 10 శాతం వాటా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+