ముంబై: ఈ ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 25,000 తపాలా కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడంతో పాటు 1,000 వరకు ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) పేర్కొంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12,441 కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న తపాలా విభాగం, 300 ఏటీఎంలను కలిగి ఉంది. ఖాతాదారులు ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకునేలా శాఖలన్నింటినీ కోర్ బ్యాంకింగ్ సిస్టం(సీబీఎస్)తో అనుసంధానించనున్నారు.

2017 మార్చి నాటికి 1,30,000 గ్రామీణ తపాలా కార్యాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయడంతోపాటు, బయోమెట్రిక్ పరికరాలు అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పరికరాలను తొలి విడతగా ఈ ఏడాది మార్చిలోపు 20,000 కార్యాలయాలకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
అదే విధంగా చెల్లింపు బ్యాంకుకు సంబంధించి కన్సల్టెంట్లను ఈ నెలాఖరుకల్లా తపాలా శాఖ ఖరారు చేయనుంది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?



Click it and Unblock the Notifications