ముంబై: పన్ను చెల్లింపుదారులకు ఐటీ అధికారుల నుంచి వేధింపులు తగ్గించాలనే ఉద్దేశంతో ఐటీ డిపార్ట్మెంట్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (206-17) నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో అన్ని రకాల సంప్రదింపులను ఇ-మెయిల్ ద్వారానే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇలా చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులు సంబంధిత కార్యాలయాలను సందర్శించే అవసరం లేకుండా చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపునకు సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, నోటీసులను జారీ చేయడానికి ఇకపై ఈమెయిల్ను ఉపయోగించాలని ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాలకు చెందిన ఐటీ రిటర్నుల తనిఖీ కోసం మదింపు అధికారులు పన్ను చెల్లింపుదారులతో ఈ-మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పన్ను చెల్లింపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, ఇందుకు సంబంధించి సంప్రదింపుల సమచారాన్నంతటినీ సెంట్రల్ సర్వర్లో భద్రపర్చడం జరుగుతుందని, అవసరమైనప్పుడు ఈ వివరాలను పునః పరిశీలించేందుకు వీలుంటుందని ఉన్నతాధికారి తెలిపారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications