ఇన్వెస్టర్లతో సైరస్ మిస్త్రీ ఎందుకు బాధపడుతున్నానని చెప్పారు?
ముంబై: టాటా మోటార్స్ తన వాటాదార్లకు 15 ఏళ్లలో తొలిసారిగా డివిడెండ్ ఇవ్వలేకపోయింది. వాటాదారులకు గత అర్ధిక సంవత్సరానికి డివిడెండ్ చెల్లించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని కంపెనీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. గురువారమిక్కడ జరిగిన కంపెనీ 70వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్)లో ఆయన మాట్లాడారు.
మీలో చాలా మంది డివిడెండ్పై ఆధారపడే వారున్నారనన్న విషయం నాకు తెలుసని, కంపెనీ ఆర్ధిక స్థితిగతులను అర్ధం చేసుకోవాలని ఆయన వాటాదారులను కోరారు. దీర్ఘకాలంలో కంపెనీ మంచి కోసం కొన్ని త్యాగాలు తప్పవని సైరస్ మిస్త్రీ చెప్పారు.
ఇన్వెస్టర్లతో సైరస్ మిస్త్రీ ఎందుకు బాధపడుతున్నానని చెప్పారు?
పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ప్రపంచ స్ధాయి నాణ్యత, వినూత్నమైన ఉత్పత్తుల ద్వారా ఉత్తమమైన లాభదాయకతను టాటా మోటార్స్ సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సైరస్ మిస్త్రీ వివరణపై ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్వెస్టర్లతో సైరస్ మిస్త్రీ ఎందుకు బాధపడుతున్నానని చెప్పారు?
డివిడెండ్ చెల్లించకపోవడానికి సరైన కారణాలు చెప్పడం లేదని వారు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఉన్నాతాధికారుల వేతనాలు పెంచుకోవడానికి తమ ఆమోదం పొందారని, తమకు మాత్రం డివిడెండ్ చెల్లించలేకపోతున్నారని ఒక ఇన్వెస్టర్ విమర్శించారు.
ఇన్వెస్టర్లతో సైరస్ మిస్త్రీ ఎందుకు బాధపడుతున్నానని చెప్పారు?
మీకు తెలుసో లేదో మీరు పుట్టక ముందు నుంచే నేను ఈ కంపెనీలో వాటాదారునని మరో ఇన్వెస్టర్ సైరస్ మిస్త్రీతో అన్నారు. మరో ఇన్వెస్టర్ తొల ఏడాది రూ. 4 డివిడెండ్ ఇచ్చారు. ఆ తర్వాత రూ. 2 డివిడెండ్ ఇచ్చారు. ఇప్పుడేమో సున్నా అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇన్వెస్టర్లతో సైరస్ మిస్త్రీ ఎందుకు బాధపడుతున్నానని చెప్పారు?
కార్ల్ స్లిమ్ స్ధానాన్ని భర్తీ చేయకపోడవంపైనా ఇన్వెస్టర్లు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. గతంలో టాటా మోటార్స్ ఛైర్మన్గా ఉన్నప్పుడు 2000-01 ఆర్ధిక సంవత్సరానికి కూటా టాటా మోటార్స్ కంపెనీ తన వాటాదారులకు డివిటెండ్ చెల్లించలేక పోయింది.