పన్నుల పెంపు ఉండదు: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ

దావోస్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే సార్వత్రిక బడ్జెట్‌లో పన్ను పెంచే ఉద్దేశమేది ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలనుకుంటున్నట్లు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)లో ఆయన చెప్పారు. దేశీయ ఆర్థిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడితే వృద్ధిరేటు మళ్లీ 8-9 శాతానికి చేరుకోనుందన్నారు.

పన్ను చెల్లింపులపై విదేశీ పెట్టుబడిదారులు లేవనెత్తిన పలు అనుమానాలపై ఆయన వివరణ ఇచ్చారు. అసమంజసమైన పన్నులు వేస్తున్నారనే అపవాదు నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు, పన్ను చెల్లింపుల్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చాలనుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు.

Budget 2015: Arun Jaitley hints at not raising tax rates, sops for manufacturing

మౌలిక రంగానికి ఊతమిచ్చేందుకు రాయితీలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ జోన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు.

గడిచిన పదేళ్లుగా సంస్కరణలు ప్రకటించడానికి ఆసక్తి చూపినప్పటికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో గత ప్రభుత్వాలు వెనుకంజ వేశాయని, కానీ ఎన్‌డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రావడంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం భారత్‌కు అధిక లాభం చేకూరుతోందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+