హైదరాబాద్: ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్కోస్టా నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో ప్రారంభ టికెట్ ధరను రూ.2,015గా నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించనున్నది.
ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చును. హైదరాబాద్ నుంచి విజయవాడ/చెన్నై/ బెంగళూరు/ తిరుపతి మధ్య టికెట్ ధరను రూ.2,015గా నిర్ణయించిన సంస్థ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్/ విజయవాడ/ తిరుపతి టికెట్ ధరను రూ.2,499గా నిర్ణయించింది.

విజయవాడ నుంచి వైజాగ్/ తిరుపతి మధ్య ధరను రూ.2,499గా నిర్ణయించింది. అలాగే బెంగళూరు టూ హైదరాబాద్కు రూ.2,015, బెంగళూరు నుంచి వైజాగ్/ అహ్మదాబాద్ మధ్య నడిచే సర్వీసుకు రూ.2,999 చార్జీ చేయనున్నది.
గ్రూపులుగా కొనుగోలు చేసిన వారికి ఈ తగ్గింపు ఆఫర్ వర్తించదని ఎయిర్కోస్టా ఎండీ ఎల్వీఎస్ రాజశేఖర్ తెలిపారు. ప్రతీ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా వివిధ ఎయిర్ లైన్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం సాధారణమే. కాగా, ఎయిర్ కోస్టా ఈ ఆఫర్లను అన్నింటికంటే ముందు ప్రకటించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications