హైదరాబాద్: వినియోగదారులను నిరంతరం ఆకట్టుకోవాలంటే మారుతున్న వారి అభిరుచులకు అనుగుణంగా వినూత్న పద్ధతులతో బ్రాండ్ ముద్ర చెరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నూతన సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
‘విజయవంతంగా బ్రాండ్ను నిలబెట్టడం, దాన్ని కొనసాగించడం'అనే అంశంపై ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాన్యా దుబాష్ మాట్లాడారు. వచ్చే పదేళ్ల కాలంలో 26శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేయాలని గోద్రేజ్ గ్రూప్ భావిస్తోందని చెప్పారు. ఇందుకు బ్రాండ్ను ఒక విలువైన ఆస్తిగా పరిగణిస్తోందని వివరించారు.
బ్రాండ్ అంటే ఒక ఆస్తి, ఒక నమ్మకం, కంపెనీపై భరోసాకు చిహ్నం అని చెప్పిన తాన్యా.. అందుకే ప్రతి రోజు గోద్రేజ్ 50 కోట్ల మందికి పైగా వినియోగదారులకు వస్తువులను విక్రయిస్తోందని చెప్పారు. ‘ప్రధాన బ్రాండ్ తోపాటు ఎన్నో బ్రాండ్లతో గ్రూప్ వస్తువులను విక్రయిస్తోంది. గోద్రేజ్ 117ఏళ్ల నాటి బ్రాండ్ అయినప్పటికీ.. వినియోగదారుల్లో గోద్రేజ్ బ్రాండ్ చెరిగిపోకుండా ఉంది' అని చెప్పారు.
నేటి నినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, కంపెనీని తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని తాన్యా దుబాష్ తెలిపారు. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు త్వరలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ను నియమించుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. దీపావలి నాటికి 10 నుంచి 15 నూతన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తామని తాన్యా చెప్పారు.

తాన్యా దుబాష్
వినియోగదారులను నిరంతరం ఆకట్టుకోవాలంటే మారుతున్న వారి అభిరుచులకు అనుగుణంగా వినూత్న పద్ధతులతో బ్రాండ్ ముద్ర చెరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు.

ఫిక్కీ
‘విజయవంతంగా బ్రాండ్ను నిలబెట్టడం, దాన్ని కొనసాగించడం'అనే అంశంపై ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాన్యా దుబాష్ మాట్లాడారు.

ఫిక్కీ
వచ్చే పదేళ్ల కాలంలో 26శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేయాలని గోద్రేజ్ గ్రూప్ భావిస్తోందని చెప్పారు. ఇందుకు బ్రాండ్ను ఒక విలువైన ఆస్తిగా పరిగణిస్తోందని వివరించారు.

ఫిక్కీ
బ్రాండ్ అంటే ఒక ఆస్తి, ఒక నమ్మకం, కంపెనీపై భరోసాకు చిహ్నం అని చెప్పిన తాన్యా.. అందుకే ప్రతి రోజు గోద్రేజ్ 50 కోట్ల మందికి పైగా వినియోగదారులకు వస్తువులను విక్రయిస్తోందని చెప్పారు.

ఫిక్కీ
‘ప్రధాన బ్రాండ్ తోపాటు ఎన్నో బ్రాండ్లతో గ్రూప్ వస్తువులను విక్రయిస్తోంది. గోద్రేజ్ 117ఏళ్ల నాటి బ్రాండ్ అయినప్పటికీ.. వినియోగదారుల్లో గోద్రేజ్ బ్రాండ్ చెరిగిపోకుండా ఉంది' అని చెప్పారు.

తాన్యా దుబాష్
నేటి నినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులు, కంపెనీని తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని తాన్యా దుబాష్ తెలిపారు.

తాన్యా దుబాష్
మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు త్వరలో కొత్త బ్రాండ్ అంబాసిడర్ను నియమించుకోనున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications