దేశంలోని నల్లధనంపైనా దృష్టి పెట్టండి: జైట్లీ

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశంలో ఉన్న నల్లధనంపైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను శాఖకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సూచనలు చేశారు.

విదేశాల్లో ఉన్న నల్లధనంపై ఏ విధంగా పోరాడుతున్నామో.. దేశంలోని నల్లధనంపైనా అంతే కఠిన స్థాయిలో స్పందించాలని అరుణ్ జైట్లీ ఆదేశించారు. విదేశాల్లో ఉన్న అక్రమార్కుల సంపదను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.

 Unearth Black Money at Home Too: Arun Jaitley to Taxmen

అదే స్థాయిలో దేశంలో ఉన్న నల్లధనాన్నీ బయటకు తెచ్చేందుకు ఐటి అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అరుణ్ జైట్లీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరని నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లు బడ్జెట్‌లో అంచనా వేసినదాని కంటే అధికంగా అవుతాయన్న విశ్వాసాన్ని అరుణ్ జైట్లీ వెలిబుచ్చారు.

ఇదిలావుంటే నల్లధనాన్ని రూపుమాపేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆర్గనేజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి) సోమవారం ఆటోమెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్చేంజ్ విధానాన్ని ప్రకటించింది. భారత్, స్విట్జర్లాండ్‌తోసహా వివిధ దేశాల మధ్య ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలు ఆటోమెటిక్‌గా పరస్పరం అందుకునేలా ‘సింగిల్ గ్లోబల్ స్టాండర్డ్'ను ఆవిష్కరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+