హైదరాబాద్లో నటి శిల్పిశర్మ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: టాలీవుడ్ నటి శిల్పి శర్మ నగరంలో బుధవారం సందడి చేశారు. అల్మా సుపర్నో సౌత్ ఇండియా తొలి పెయిన్ ఫ్రీ రిమూవల్ మెషీన్ను ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ 14లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మెషీన్ పనితీరును పరిశీలించారు.
కెనాన్ నుంచి 9 కొత్త ప్రింటర్లు
ఇంక్జెట్ ప్రింటర్ల మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యంగా కెనాన్ కంపెనీ తొమ్మిది కొత్త ప్రింటర్లను మార్కెట్లో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం కెనాన్ నుంచి మార్కెట్లో ఉన్న ఇంక్జెట్ ప్రింటర్ల సంఖ్య 24కి చేరింది. కొత్త తరానికి చెందిన డివైస్లను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సారి విడుదల చేసిన తొమ్మిది ప్రింటర్లలో ఆరు వైఫై ప్రింటర్లు తీసుకువచ్చినట్టు కెనాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అలోక్ భరద్వాజ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తమ వృద్ధిరేటు 119 శాతం ఉన్నదని, దీంతో హైదరాబాద్ వేదికగా ఈ కొత్త ప్రింటర్లను జాతీయ మార్కెట్కు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోనూ ఎం పెసా సేవలు
మొబైల్ ద్వారా నగదు బదిలీతోపాటు చెల్లింపులు నిర్వహించే ఎం పెసా సేవలను రాష్ట్రంలో ప్రారంభించడం ద్వారా ఈ సేవలను దేశం అంతటా విస్తరించామని వొడాఫోన్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ బుధవారం ఇక్కడ ప్రకటించాయి. బ్యాంకు ఖాతాలకు, బ్యాంకు ఖాతా లేకున్నా, మొబైల్ వినియోగిస్తున్న (ఆపరేటర్తో సంబంధం లేదు) వారికి నగదు బదిలీ చేయడంతోపాటు, బిల్లుల చెల్లింపు, మొబైల్-డిటిహెచ్ రీఛార్జికి ఈ డిజిటల్ మనీని వాడుకోవచ్చు. దేశంలోని 60వేలకు పైగా అధీకృత ఏజెంట్ల వద్ద నగదును మొబైల్ లోకి నింపడంతోపాటు, ఎవరైనా పంపిన నగదును తీసుకునే వీలుంటుందని వొడాఫోన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సునీల్ సూద్ చెప్పారు.
ఎం-పెసా సేవ ద్వారా వొడాఫోన్ కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఎవరి బ్యాంకు ఖాతాకైనా, మొబైల్ ఫోన్కైనా నగదును పంపించవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్కు నగదు పంపినపుడు వచ్చే సందేశాన్ని వొడాఫోన్ అధీకృత ఔట్లెట్లలో చూపించడం ద్వారా నగదును తీసుకోవచ్చన్నారు. మొబైల్ ఫోన్ రీచార్జ్, బిల్లుల చెల్లింపులు, డిటిహెచ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్, ఇ-కామర్స్ వంటి సేవలను కూడా ఎం-పెసా ద్వారా పొందవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని 23 జిల్లాల్లో 3,826 మంది ఆథరైజ్డ్ ఏజెంట్ల వద్ద ఈ సర్వీసును అందిస్తున్నామన్నారు.
మెషీన్ ఆవిష్కరిస్తూ..
టాలీవుడ్ నటి శిల్పి శర్మ నగరంలో బుధవారం సందడి చేశారు. అల్మా సుపర్నో సౌత్ ఇండియా తొలి పెయిన్ ఫ్రీ రిమూవల్ మెషీన్ను ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ 14లో ఆవిష్కరించారు.
నిర్వాహకులతో..
అల్మా సుపర్నో సౌత్ ఇండియా తొలి పెయిన్ ఫ్రీ రిమూవల్ మెషీన్ను ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ 14లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెషీన్ వద్ద నిర్వాహకులతో శిల్పిశర్మ.
మెషీన్ పరిశీలిస్తూ..
అల్మా సుపర్నో సౌత్ ఇండియా తొలి పెయిన్ ఫ్రీ రిమూవల్ మెషీన్ను ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ 14లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెషీన్ పరిశీలిస్తున్న శిల్పిశర్మ.
మెషీన్ పరిశీలిస్తూ..
అల్మా సుపర్నో సౌత్ ఇండియా తొలి పెయిన్ ఫ్రీ రిమూవల్ మెషీన్ను ఆమె హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రోడ్ 14లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెషీన్ వద్ద నిర్వాహకులతో శిల్పిశర్మ.
కెనాన్ కొత్త ప్రింటర్లు
ఇంక్జెట్ ప్రింటర్ల మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యంగా కెనాన్ కంపెనీ తొమ్మిది కొత్త ప్రింటర్లను మార్కెట్లో విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం కెనాన్ నుంచి మార్కెట్లో ఉన్న ఇంక్జెట్ ప్రింటర్ల సంఖ్య 24కి చేరింది.
వొడాఫోన్ ఎం పెసా
మొబైల్ ద్వారా నగదు బదిలీతోపాటు చెల్లింపులు నిర్వహించే ఎం పెసా సేవలను రాష్ట్రంలో ప్రారంభించడం ద్వారా ఈ సేవలను దేశం అంతటా విస్తరించామని వొడాఫోన్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ బుధవారం ఇక్కడ ప్రకటించాయి.