2012-13 ఆర్దిక సంవత్సరానికి 8.5% వడ్డీ: ఈపీఎఫ్‌ఓ

EPFO
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ)లో సొమ్ము దాచుకునే 5 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు వడ్డీరేట్ల పెంపు ఊరట లభించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరమైన 2012-13కి 8.5 శాతం వడ్డీ రేటును ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అమల్లో ఉన్న 8.25 శాతంతో పోలిస్తే ఇది పావు శాతం ఎక్కువ. ఈ నెల 15న జరగనున్న కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన రావచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం.

2010-11 ఏడాదిలో 9.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్‌ఓ వడీరేటును గతేడాదిలో ఏకంగా 8.25 శాతానికి కోతపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, వడ్డీరేటుకు సంబంధించిన ప్రతిపాదనను ముందుగా సలహా సంఘమైన ఆర్థిక, పెట్టుబడుల కమిటీ(ఎఫ్‌ఐసీ)కి ఈ నెల 14న ఈపీఎఫ్‌ఓ సమర్పించనుంది. ఈ కమిటీ ఆమోదం లభించాక ఈ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కార్మిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సీబీటీ పరిశీలనకు వెళ్తుంది. ఆర్దిక శాఖ సమ్మతించిన తర్వాత ప్రభుత్వం వడ్డీ రేటుపై నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2010-11లో ఈపీఎఫ్‌ఓ 9.5 శాతం వడ్డీని చెల్లించింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+