రూ. లక్ష వరకు నగదుని ఆన్‌లైన్‌లో ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు

Finance Ministry favours free etransfer of funds up to Rs 1 lakh
న్యూఢిల్లీ: నగదు రహిత నిధుల బదిలీలను ప్రోత్సహించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఫైనాన్స్ మినిస్ట్రీ సూచించింది. ఇందులో భాగంగా రూ. లక్ష వరకు నగదుని ఆన్‌లైన్‌లో ఉచితంగా బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ ద్వారా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌లోకి లక్ష రూపాయల వరకూ నిధుల బదలాయింపునకు పలు బ్యాంకులు రూ.5 గరిష్ట ఫీజును వసూలు చేస్తున్నాయి. రూ. పదివేలు వరకూ లావాదేవీపై ఈ ఫీజు రూ.2.50గా ఉంది. కాగా లక్ష రూపాయల నుంచి రూ. 2 లక్షల వరకూ ఎలక్ట్రానిక్ బదలాయింపునకు గరిష్ట చార్జీ రూ. 15.

ఛార్జీల తగ్గింపుపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకుందీ ఆర్దిక శాఖ కొన్ని బ్యాంకులు ఇంత వరకూ తెలియజేయలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అధిక వ్యాపారం జరుగుతున్న 20 శాతం బ్రాంచీలను గుర్తించి, ఆయా బ్రాంచీలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చెక్కు ఆధారిత లావాదేవీల సంఖ్యను కనీసం ఐదవ వంతుకు తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా బ్యాంకులకు ఆర్థికశాఖ సూచించింది. స్వల్ప మొత్తాలు కాకుండా భారీ చెల్లింపులు, పంపిణీలు అన్నీ ఆన్‌లైన్ మార్గంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.

ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థ వినియోగం వల్ల లభించే ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం ద్వారా నగదురహిత లావాదేవీల విధానాన్ని మరింత పటిష్టం చేయవచ్చని ఇటీవల బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+