ఈ-ఫైలింగ్ గడువుని ఆగస్టు 31 వరకు పొడిగించిన ప్రభుత్వం

Deadline for e-filing of returns extended to August 31, 2012
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆన్‌లైన్ ద్వారా ఈ-ఫైలింగ్ దాఖలు చేసే చివరితేదీని ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. నార్తరన్ గ్రిడ్ సరిగా పని చేయకపోవడంతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో వరుసగా రెండు రోజులపాటు విద్యుత్ సంక్షోభం తలెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సడలింపు ఆన్‌లైన్ ద్వారా విధిగా దాఖలు చేయాల్సిన అసెస్సీలకు మాత్రమే వర్తిస్తుంది. ఫిజికల్‌గా దాఖలు చేయాల్సిన వారికి ఈ పెంచిన గడువు వర్తించదు.

జూలై 31లోగా అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండగా నార్తరన్ గ్రిడ్ హాఠాత్తుగా కుప్పకూలడంతో ఈ-ఫైలింగ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉన్నతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సంవత్సరం ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారు, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్న వారు, హిందు అవిభక్త కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్న నిబంధన విధించిన సంగతి తెలిసిందే.

అలాగే ఆదాయం రూ.60 లక్షలు దాటిన వ్యాపార సంస్థలు, రూ. 15 లక్షల ఆదాయం దాటిన వృత్తి నిపుణులు కూడా ఈ-ఫైలింగ్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలి. 2011-12 సంవత్సరంలో 1.64 కోట్ల మంది ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయగా, ఈ మార్చి నాటికి 1.92 కోట్ల మంది ఈ-ఫైలింగ్ కోసం నమోదు చేసుకున్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+