గ్రీన్ ఎనర్జీ వెనుక చేదు నిజం... 11 మిలియన్ టన్నుల రిన్యూవబుల్ చెత్తతో నిండిపోనున్న భారత్

భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా ముందుకెళ్తోంది. సౌర, గాలి వంటి పరిశుభ్రమైన శక్తి వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ గ్రీన్ శక్తి విస్తరణ వెనుక ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని మరో సమస్య నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. అదే పునరుత్పాదక ఇంధన వ్యర్థాల సమస్య.

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం.. 2047 నాటికి భారతదేశంలో 11 మిలియన్ టన్నులకు పైగా ఉపయోగం ముగిసిన సౌర ప్యానెల్‌లు వ్యర్థంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యర్థాల్లో గాజు, సిలికాన్, అల్యూమినియం మాత్రమే కాకుండా వెండి, రాగి వంటి విలువైన లోహాలు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. శుభ్రమైన ఇంధన లక్ష్యాల కోసం దేశం చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ వ్యర్థాలు ఏర్పడుతున్నప్పటికీ.. వాటిని ఎలా నిర్వహించాలన్న ప్రశ్న ఇప్పటికీ స్పష్టమైన సమాధానం పొందలేదు.

India renewable waste renewable energy waste India solar panel waste India wind turbine waste India green energy waste crisis India clean energy transition renewable waste by 2040 11 million tons waste India solar waste management India wind energy waste problem India renewable boom impact climate change India energy sustainable energy challenges India 2040 11

వేస్ట్ ఈజ్ గోల్డ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సందీప్ తివారీ మాట్లాడుతూ..భారతదేశంలో సౌర వ్యర్థాల రీసైక్లింగ్ కోసం పూర్తి స్థాయి పర్యావరణ వ్యవస్థ ఇంకా అభివృద్ధి కాలేదని చెప్పారు. పునరుత్పాదక రంగం వేగంగా పెరుగుతున్నా, రీసైక్లింగ్‌కు అవసరమైన విధానాలు, ప్రోత్సాహకాలు ఇంకా సరిపడా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత దశాబ్దంలో ఏర్పాటు చేసిన పెద్ద సౌర విద్యుత్ కేంద్రాల ప్యానెల్‌లు ఇప్పుడే వాటి జీవితకాలం చివరి దశకు చేరుకోలేదు. అందువల్ల సౌర వ్యర్థాల పూర్తి ప్రభావాన్ని దేశం ఇప్పటివరకు అనుభవించలేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ కారణంగానే భారతదేశంలో అధికారిక రీసైక్లింగ్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యర్థాల సరఫరా నిరంతరం అందుబాటులో ఉంటుందా అన్న అనిశ్చితి పెట్టుబడిదారులను వెనుకడుగు వేయిస్తోందని వాతావరణ మార్పుల నిపుణురాలు డాక్టర్ ఎలియా జాఫర్ తెలిపారు. తాత్కాలికంగా వ్యర్థాలను నిల్వ చేయడం సులభంగా అనిపించినా, దీర్ఘకాలంలో అవి ఆర్థికంగా, పర్యావరణపరంగా పెద్ద భారంగా మారతాయని ఆమె హెచ్చరించారు.

అయితే ఈ సమస్యలోనే ఒక పెద్ద అవకాశం కూడా దాగి ఉంది. CEEW అంచనాల ప్రకారం..సౌర వ్యర్థాల రీసైక్లింగ్ మార్కెట్ 2047 నాటికి సుమారు రూ.3,700 కోట్ల విలువను చేరుకోవచ్చు. అంతేకాదు, దేశంలోని సౌర తయారీ అవసరాల్లో దాదాపు 38 శాతం వరకు రీసైక్లింగ్ ద్వారానే సరఫరా చేసే అవకాశం ఉంది. దీని వల్ల విదేశీ సరఫరా గొలుసులపై ఆధారపడటం తగ్గి, దేశీయ తయారీ బలోపేతం అవుతుంది.

రీసైక్లింగ్ ద్వారా తిరిగి పొందిన లోహాలను ఉపయోగించడం వల్ల చైనాపై దిగుమతుల మీద ఆధారపడటం తగ్గడమే కాకుండా, కొత్త ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా, కొత్తగా తవ్వే పదార్థాలకు బదులుగా రీసైకిల్ చేసిన వనరులను ఉపయోగించడం వల్ల 2047 నాటికి సుమారు 37 మిలియన్ టన్నుల CO₂ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే భారత్ ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. 2047 నాటికి కనీసం 299 ఆధునిక రీసైక్లింగ్ కేంద్రాలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి కేంద్రం సంవత్సరానికి వేల టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఉండాలి.

దీనికి పరిష్కారంగా.. సౌర ప్యానెల్‌లకు విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత (EPR) విధానాన్ని అమలు చేయడం, జాతీయ స్థాయి సర్క్యులర్ సోలార్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం, పరిశోధన, అభివృద్ధికి మరింత నిధులు కేటాయించడం వంటి చర్యలు అవసరమని సూచిస్తున్నారు. సరైన విధానాలు, బలమైన రీసైక్లింగ్ వ్యవస్థ అమలైతే, ఈ వ్యర్థాల సమస్య భారత్‌కు ఒక హరిత పారిశ్రామిక అవకాశంగా మారే అవకాశముంది. ఏదేమైనా పునరుత్పాదక శక్తి విస్తరణ ఆగదు, వ్యర్థాలు కూడా ఆగవు. కానీ ముందుచూపుతో చర్యలు తీసుకుంటే, భారత్ కేవలం పరిశుభ్రమైన శక్తినే కాదు, స్వచ్చమైన పర్యావరణ వ్యవస్థను కూడా నిర్మించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+