కరోనా నేపథ్యంలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.50,000 కోట్ల మూలధన సాయం అందించేందుకు ప్రకటించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దీంతో ఆయా దేశాలు ప్యాకేజీలు ప్రకటించాయి. మోడీ ప్రభుత్వం కూడా జీడీపీలో 10 శాతాని కంటే ఎక్కువ ప్యాకేజీని ప్రకటించింది.

ఎంఎస్ఎంఈలకు అండగా ఉండేందుకు..
తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.10,000 కోట్ల పరిమాణం గల ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలో అందుబాటులోకి వస్తోందన్నారు. నిధుల కొరత, తక్కువ ఆదాయాలతో సతమతమవుతున్న కంపెనీలకు అండగా నిలవడమే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉద్దేశ్యమని తెలిపారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడారు. ఎంఎస్ఎంఈలకు లిక్విడిటీ సాయం అందించేందుకు బ్యాంకులు ఇప్పటికే అత్యవసర రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయని, ఈ కొత్త ఫండ్ వారికి మరింత ఊరటను ఇస్తుందన్నారు.

పసిడి పథకం..
ఓ ప్రధాన నిధి, కొన్ని అనుబంధ నిధుల ఆధారంగా ఈ స్కీం అమలు అవతుందని రజనీష్ చెప్పారు. ఎంఎస్ఎంఈల కోసం ఇటీవల ఓ పసిడి పథకాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద ఒక్క నెలలోనే రూ.88 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. మీరు లాకర్కు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రుణాలపై హామీ ద్వారా ప్రభుత్వం కూడా ధీమా కల్పించిందన్నారు.

ఫండ్ ఆఫ్ ఫండ్స్
ఎంఎస్ఎంఈలకు తమ వ్యాపార పరిమాణాన్ని, సామర్థ్యం పెంచుకునేందుకు, స్టాక్ ఎక్స్చేంజీల్లో ప్రధాన ప్లాట్ఫాంపై నమోదయ్యేలా ప్రోత్సహించేందుకు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (FOF) నిధి ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మే నెలలో చెప్పారు. ప్రొఫెషనల్ కార్పోరేషన్లు లేదా వెంచర్ కేపిటలిస్టుల సహకారం ద్వారా నిధులు సేకరించే అవకాశం లేని వారికి ప్రారంభ దశలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ప్రయోజనకరమని నిర్మల తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications