ఎంఎస్ఎంఈలకు రూ.1 లక్ష కోట్లు, కేంద్రం నుండి భారీ ఊరట

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(MSME)లకు నిధుల ఇబ్బందులు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1 క్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం అనంతరం కేబినెట్ పరిశీలనకు పంపిస్తామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దేశంలోని MSME చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేందుకు ఈ నిధిని కేంద్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ నిధి ఏర్పాటు కోసం తాము ఓ స్కీమ్‌‌ను రూపొందించామన్నారు. చెల్లింపులు చేస్తున్న కంపెనీకి, అందుకుంటున్న కంపెనీకి, బ్యాంకులకు మధ్య వడ్డీ భారం ఏ విధంగాపంచుకోవాలనే అంశంపై కూడా తాము ఒక ఫార్ములా రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Gadkari proposes Rs 1 lakh crore fund for small firms

ఈ నిధి ఏర్పాటు ఎంఎస్ఎంఈలకు కొంత ఊరటనిస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, భారీ పరిశ్రమలు MSMEలకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయని చెప్పారు. దీంతో ఈ నిధితో ఆ బకాయిల్ని చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ వాటాధనంతో దీనిని బలపరుస్తామన్నారు. మార్కెట్లో నగదు లభ్యత పెరిగేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

అయినప్పటికీ MSMEలకు బాకీపడిన మొత్తాలను వెంటనే చెల్లించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ కోరారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతోన్న విషయం తెలిసిందే. MSMEల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కేంద్రం చర్యలకు దిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+