క్రెడిట్ గ్యారెంటీ స్కీం, ఆ కంపెనీలకు రూ.1.30 లక్షల కోట్లు మంజూరు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS) కింద 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 22 ప్రయివేటు రంగ బ్యాంకులు 23 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజురూ చేస్తున్నాయి. శుక్రవారం నాటి ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం జూన్ 23వ తేదీ నాటికి ఎంఎస్ఎంఈలకు ఇప్పటి వరకు రూ.1,30,491 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.82,065 కోట్లు పంపిణీ చేశారు.
లక్షల చికెన్ బిర్యానీలు, లావా కేక్స్: లాక్డౌన్లో ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఇవే..
ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల రుణ మంజూరు
రూ.21 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు ECLGS కింద రూ.3 లక్షల కోట్ల రుణాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీని కింద బ్యాంకులు ఇప్పటి వరకు రూ.1,30,491.79 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ECLGS కింద పబ్లిక్ సెక్యార్ బ్యాంకుల రుణాలు రూ.71,818.16 కోట్లకు పెరిగాయని, జూలై 23 నాటికి ఇందులో రూ.47,631.41 కోట్లు పంపిణీ జరిగినట్లు తెలిపింది. ప్రయివేటు బ్యాంకులు రూ.58,673 కోట్లు మంజూరు చేయగా, రూ.34,433 పంపిణీ చేసినట్లు తెలిపింది.
ఎస్బీఐ అధిక రుణాలు
జూలై 20, 2020 నాటితో పోల్చితే రుణ మంజురూ రూ.2,909.19 కోట్లు పెరిగిందని, ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో కలిపి రూ.4,451.95 పెరుగుదల నమోదు అయినట్లు తెలిపింది. ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ ఎక్కువగా రూ.21,027 కోట్లు మంజూరు చేయగా, రూ.15,112 కోట్లు పంపిణీ చేసింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,463 కోట్లు మంజూరు చేసి, రూ.5,295 కోట్లు పంపిణీ చేసింది.
కార్పస్ ఫండ్
ECLGS కింద ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు మే 20వ తేదీన కేబినెట్ ఆమోదం తెలిపింది. కన్సెషనల్ రేటు 9.25 శాతానికి ఈ రుణాలు ఇస్తున్నారు. ECLGS స్కీం కింద అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు, ఆసక్తి కలిగిన మైక్రో యూనిట్ల అభివృద్ధికి 100 శాతం గ్యారంటీతో ఈ రుణాలు ఇస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.41,600 కోట్లతో కార్పస్ ఏర్పాటు చేసింది.