కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS) కింద 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 22 ప్రయివేటు రంగ బ్యాంకులు 23 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజురూ చేస్తున్నాయి. శుక్రవారం నాటి ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం జూన్ 23వ తేదీ నాటికి ఎంఎస్ఎంఈలకు ఇప్పటి వరకు రూ.1,30,491 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.82,065 కోట్లు పంపిణీ చేశారు.

ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల రుణ మంజూరు
రూ.21 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు ECLGS కింద రూ.3 లక్షల కోట్ల రుణాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీని కింద బ్యాంకులు ఇప్పటి వరకు రూ.1,30,491.79 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ECLGS కింద పబ్లిక్ సెక్యార్ బ్యాంకుల రుణాలు రూ.71,818.16 కోట్లకు పెరిగాయని, జూలై 23 నాటికి ఇందులో రూ.47,631.41 కోట్లు పంపిణీ జరిగినట్లు తెలిపింది. ప్రయివేటు బ్యాంకులు రూ.58,673 కోట్లు మంజూరు చేయగా, రూ.34,433 పంపిణీ చేసినట్లు తెలిపింది.

ఎస్బీఐ అధిక రుణాలు
జూలై 20, 2020 నాటితో పోల్చితే రుణ మంజురూ రూ.2,909.19 కోట్లు పెరిగిందని, ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో కలిపి రూ.4,451.95 పెరుగుదల నమోదు అయినట్లు తెలిపింది. ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ ఎక్కువగా రూ.21,027 కోట్లు మంజూరు చేయగా, రూ.15,112 కోట్లు పంపిణీ చేసింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,463 కోట్లు మంజూరు చేసి, రూ.5,295 కోట్లు పంపిణీ చేసింది.

కార్పస్ ఫండ్
ECLGS కింద ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు మే 20వ తేదీన కేబినెట్ ఆమోదం తెలిపింది. కన్సెషనల్ రేటు 9.25 శాతానికి ఈ రుణాలు ఇస్తున్నారు. ECLGS స్కీం కింద అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు, ఆసక్తి కలిగిన మైక్రో యూనిట్ల అభివృద్ధికి 100 శాతం గ్యారంటీతో ఈ రుణాలు ఇస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.41,600 కోట్లతో కార్పస్ ఏర్పాటు చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications