రూ.98 రీఛార్జ్ ప్లాన్ను నిలిపేసిన జియో, ఇప్పుడు అదే చవకైన ప్లాన్
టెలికం రంగంలోకి అడుగుపెట్టిన మూడున్నరేళ్లలోనే అదరగొట్టిన రిలయన్స్ జియో.. ఇప్పుడు తన అతి చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ డేటాను నిలిపివేసింది. గత కొంతకాలంగా వివిధ రీఛార్జ్లపై టెల్కోలు ధరలు పెంచుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జియో నెట్ వర్క్లోని అతి తక్కువ ప్లాన్ రూ.98ని నిలిపివేసింది. ఈ ప్లాన్ను తమ వెబ్ సైట్ నుండి తొలగించింది. ఈ ధరను రూ.129గా నిర్ణయించింది. దీంతో జియో ఆఫర్లలో తక్కువ ప్లాన్ ఇదే అవుతుంది.
హైదరాబాద్, విశాఖపట్నంల్లోను జియోమార్ట్: ఆకర్షణీయ డిస్కౌంట్, నేరుగా రైతుల నుండే...
రూ.129 రీఛార్జ్ ప్రయోజనాలు ఇవి..
రూ.129తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా, జియో నుండి జియోకు అపరిమిత ఉచిత కాల్స్, రోజుకు 300 ఎస్సెమ్మెస్లు ఉంటాయి. దీని కాల పరిమితి 28 రోజులు. ఇత నెట్ వర్క్స్కు కాల్ చేయాలంటే ఈ ప్లాన్తో పాటు అదనంగా టాపప్ ఓచర్ తప్పనిసరి.
థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ నుండి కూడా..
జియో వెబ్ సైట్ , జియో మై యాప్ నుండి రూ.98 ప్లాన్ను తొలగించారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్స్ పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే నుండి కూడా తొలగించారు. 28 రోజుల పాటు 2GB వచ్చే ఈ ప్లాన్ను చాలామంది కొనుగోలు చేసేవారు. తక్కువగా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆఫర్గా ఉంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్..
జియో ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం రూ.999తో 84 రోజుల కాల పరిమితితో రోజుకు 3GB డేటా, జియో నుండి ఇతర నెట్ వర్క్స్కు 3వేల కాల్స్ ఉచితం, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.599, రూ.399 ప్లాన్స్ ఉన్నాయి. వీటితో రోజుకు 2GB డేటా, 1.5GB డేటా ఉంది.