FASTagను ఇంకా కొనుగోలు చేయలేదా? అయితే మీకో గుడ్న్యూస్! జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం FASTagను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉచితంగా పొందవచ్చు. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ పదిహేను రోజుల పాటు కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ టోల్ విధానాన్ని మెరుగుపరచడం కోసం FASTagలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

రూ.100 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ మేరకు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వీటిని NHAIలకు చెందిన టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వద్ద ఉచితంగా పొందవచ్చు. వాహనదారులు పై ప్రాంతాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా FASTagలను తీసుకోవచ్చునని ప్రకటించింది. రూ.100 ఛార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

డిపాజిట్, కనీస బ్యాలెన్స్ మాత్రం ఉండాలి
అయితే FASTag వ్యాలెట్కు వర్తించే సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ విధానంలో మాత్రం మార్పు లేదని తెలిపింది. మరిన్ని వివరాల కోసం మైఫాస్టాగ్ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా లేదా దగ్గరలోని కేంద్రానికి వెళ్లడం ద్వారా లేదా 1033 సహాయక బృందం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

RCని చూపించు తీసుకోవచ్చు
వాహన వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రే,న్ సర్టిఫికెట్ (RC)ని NHAI టోల్ ఫ్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపుల వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి FASTagను పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేంద్రం జనవరి 15, 2020 నుండి ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్ వల్ల ప్రయాణీకులు టోల్ ప్లాజా వద్ద వేచి చూసే ఇబ్బందులు తప్పుతాయి. ఇంధన వాడకం తద్వారా కాలుష్యం తగ్గుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?



Click it and Unblock the Notifications